ఎన్టీఆర్ మళ్లీ జంప్..

స్టార్ హీరోల సినిమాల కోసం వారి ఫ్యాన్స్ ఎంత ఈగర్ గా చూస్తారో అందరికీ తెలుసు. అవి లేట్ అయితే బెదిరింపులకు కూడా దిగుతుంటారు. అభిమాన హీరో సినిమా అప్డేట్స్ కోసం కళ్లు కాయలు కాచేలా చూసే వీరిని పట్టించుకోకపోతే ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా అదే చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత చేయబోయే సినిమా విషయంలో ఓ రకంగా హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా ఇరిటేట్ అవుతున్నారంటే అతిశయోక్తి కాదు. ముందుగా త్రివిక్రమ్ తో సినిమా అనుకున్నారు. అది ఆగిపోయింది.

తర్వాత అందరరూ ఒద్దని చెప్పినా.. వినకుండా కొరటాల శివతో సినిమాకు కమిట్ అయ్యాడు ఎన్టీఆర్. ఈ కాంబోలో ఆల్రెడీ జనతా గ్యారేజ్ వచ్చింది. పైగా కొరటాల రీసెంట్ గా ఆచార్య వంటి డిజాస్టర్ చూసి ఉన్నాడు. అయినా ఎన్టీఆర్ ఓకే చేయడమే ఫ్యాన్స్ కు నచ్చలేదు. పోనీ కమిట్ అయిన కథైనా ముందుకు సాగుతుందా అంటే అదీ లేదు. దాదాపు ఆరు నెలలుగా ఈ ప్రాజెక్ట్ ఎటూ కదలడం లేదు. అసలు ఉందా లేదా అనే డౌట్స్ కూడా ఓ దశలో వచ్చాయి. అయినా అవేవీ పట్టించుకోకుండా ఉందీ టీమ్.


కనీసం ఎన్టీఆర్ టీమ్ నుంచి అయినా ఏదైనా అప్డేట్ వస్తుందనుకుంటే అతనూ పట్టించుకోవడం లేదు. కొరటాల అయితే పూర్తిగా సైలెంట్ గా ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ కు ప్యాన్ ఇండియన్ స్టార్ అనే ఇమేజ్ వచ్చింది. ఆ ఇమేజ్ ను మ్యాచ్ చేసేలా ఈ కథ ఉండాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కుదరడం లేదు అని ముందు నుంచీ వినిపిస్తోన్న మాట. మామూలుగా కొరటాల మంచి కథలే రాసుకుంటాడు. కానీ ఇప్పుడు ప్యాన్ ఇండియన్ స్టోరీ కావాలి కదా.. అదే పక్కాగా రావడం లేదు. ఇక ఆ మధ్య ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్, ఆర్ట్ డైరెక్టర్స్ వీళ్లే అంటూ ఇద్దరిని పరిచయం చేశారు.

ఇక డిసెంబర లోనే స్టార్ట్ అనేలా హింట్ కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు చూస్తే ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి నెల రోజుల పాటు లాంగ్ టూర్ కు వెళుతున్నాడు. అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తర్వాతే తిరిగి ఇండియాలో అడుగుపెడతాడట. అంటే అప్పటి వరకూ కొరటాల టీమ్ ఇంకా కథపై కసరత్తులు చేస్తూనే ఉండాలేమో. ఏదేమైనా ఎన్టీఆర్ లాంగ్ టూర్ కు వెళ్లడంతో ఈ ప్రాజెక్ట్ పై ఉన్న అనుమానాలు మళ్లీ మొదటికి వచ్చాయి.

Related Posts