మహేష్‌బాబు – త్రివిక్రమ్ సడెన సర్ ప్రైజ్..

మహేష్‌ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల క్రేజీ కాంబినేషన్ లో హారిక హాసిని బ్యానర్ లో సినిమా స్టార్ట్ అయింది. దాదాపు పన్నెండేళ్ల క్రితం మహేష్‌ – త్రివిక్రమ్ కాంబోలో ఖలేజా వచ్చింది. అంతకు ముందు అతడు సినిమాతో ఆకట్టుకున్నారు. అయితే ఈ రెండు సినిమాలూ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేదు. అయినా ఇప్పుడు టివిల్లో మాత్రం మోస్ట్ వాచ్డ్ మూవీస్ గా నిలిచాయి. మరోవైపు త్రివిక్రమ్ అల వైకుంఠపురములో వంటి బిగ్గెస్ట్ హిట్ తో ఉన్న టైమ్ కావడం.. మహేష్‌ వరుస విజయాలతో ఉండటంతో ఈ కాంబినేషన్ పై ఇప్పుడు కూడా భారీ అంచనాలున్నాయి.

వాటిని అందుకుంటాం అంటూ ఆ మధ్య షూటింగ్ స్టార్ట్ చేశారు. కానీ ఫస్ట్ షెడ్యూల్ కే ప్యాకప్ చెప్పేశారు. ఓ స్పై థ్రిల్లర్ గా రూపొందుతున్న ఆ కథ మహేష్‌ కు నచ్చలేదు. దీంతో ఆ షెడ్యూల్ ను పక్కన పెట్టేసి కొత్త కథ రాసుకున్నాడు త్రివిక్రమ్. ఇదే టైమ్ లో కృష్ణగారు చనిపోవడంతో మరింత గ్యాప వచ్చింది.

అలాగే కొత్త కథ కూడా పూర్తిగా సిద్ధంగా లేదు అనే టాక్స్ కూడా వచ్చాయి. దీంతో ఈ కాంబినేషన్ లో సినిమా మరో రెండు నెలలైనా ఆలస్య ం అవుతుందనుకున్నారు. బట్ సడెన్ సర్ ప్రైజ్ చేసిందీ టీమ్.


మహేష్‌ బాబు – త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి అంతా సిద్ధమైంది. వచ్చే నెల నుంచే రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చేయబోతున్నారు. ఈ మేరకు అఫీషియల్ గానే అనౌన్స్ చేశారు. నిర్మాతలు, హీరో, దర్శకుడు కలిసి డిస్కషన్స్ పూర్తి చేసిన తర్వాతే అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఇక పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. మొదట మొదలైన ప్రాజెక్ట్ లో శ్రీ లీల లేదు.

ఈ రెండో కథలోకి రెండో హీరోయిన్ గా తన ఎంటర అయింది. అలాగే ఆ ప్రాజెక్ట్ ను ఏప్రిల్ 28న విడుదల చేయాలనుకున్నారు. ఈ కొత్త కథన కూడా అదే డేట్ కు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారట. ఇందుకోసం మహేష్‌ బాబు కూడా కంటిన్యూస్ గా షూటింగ్ లో పార్టిసిపేట్ చేయబోతున్నాడు. మొత్తంగా కాస్త లేట్ అవుతుందనుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ సర్ ప్రైజింగ్ గా నెక్ట్స్ మంత్ నుంచే స్టార్ట్ కాబోతోందన్నమాట.

Related Posts