సర్ ప్రైజ్.. అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ కొత్త ప్రాజెక్ట్

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ కు ఓ క్రేజ్ ఉంది. వీరి కలయికలో వచ్చిన మూడు సినిమాలూ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి, అల వైకుంఠపురములో అంటూ మూడూ డిఫరెంట్ కంటెంట్స్ తో వచ్చిన చిత్రాలే. ప్రస్తుతం వీరు వేర్వేరు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్ పుష్ప2 చేస్తున్నాడు. త్రివిక్రమ్ .. మహేష్‌ బాబుతో గుంటూరు కారం అన చిత్రం చేస్తున్నాడు. అలాంటిది ఈ ఇద్దరూ కలిసి సడెన్ గా ఓ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. అంతే కాదు.. ఏకంగా సెట్స్ లో ఉన్న ఫోటోస్ కూడా విడుదల చేశారు. అయితే ఇది థియేటర్స్ కోసం కాదు. ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్ కోసం.

ఇది ఎవరూ ఊహించలేదు. అందుకే చాలామంది సర్ ప్రైజ్ అవుతున్నారు. అయితే ఇది వెబ్ సిరీసా లేక వెబ్ మూవీనా అనే క్లారిటీ లేదు. బట్ ఏదైనా త్రివిక్రమ్ రేంజ్ డైలాగ్స్ తో అంచనాలుమాత్రం అమాంతంగాం పెంచేలా ” కలిశారు మళ్లీ ఇద్దరూ.. ఇక రికార్డులు వేట మొదలు. అది మరెవరో కాదు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అల్లు అర్జున్ డైరెక్ట్ చేస్తున్నాడు. అతి పెద్ద సినిమా పండగ చేసుకుందాం. గెట్ రెడీ ఫర్ ఎంటర్టైన్మెంట్ సునామీ.. త్వరలోనే వస్తోంది..” అంటూ పెట్టిన క్యాప్షన్ కు బన్నీ ఫ్యాన్స్ అల్లాడిపోతున్నారు.


ఇక ఆహాను అల్లు అర్జున్ టేక్ ఓవర్ చేశాడు అనే మాట కూడా ఆకట్టుకుంటోంది. ఏదేమైనా ఈ ఇద్దరి కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ వల్ల అది ఏ ప్లాట్ ఫామ్ అయినా అదిరిపోతుందని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. బట్ వీళ్లు సినిమా చేస్తున్నారా లేక ఇంకేదైనా నా అనే క్యూరియాసిటీని మాత్రం అలా వదిలేశారు. మరి ఏమై ఉంటుందబ్బా.. ?

Related Posts