జర్నలిస్ట్ మూర్తి సంధిస్తోన్న పొలిటికల్ అస్త్రం ‘ప్రతినిధి 2’

పలు విలక్షణ పాత్రలతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని స్థానం సంపాదించుకున్న నటుడు నారా రోహిత్. నారా రోహిత్ చిత్రాలలో ‘ప్రతినిధి’ సినిమాది ప్రత్యేక స్థానం. 2014లో వచ్చిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేయడం ద్వారా సమాజంపై ప్రశ్నల వర్షం కురిపించే బాధ్యతాయుతమైన యువకుడి పాత్ర బాగా గుర్తిండిపోతుంది. మళ్లీ పదేళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘ప్రతినిధి 2’ వస్తోంది. ఈ సినిమాతో ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

‘ఇప్పటికైనా కళ్లు తెరవండి.. ఒళ్లు విరిచి బయటకు వచ్చి ఓటేయండి.. లేదంటే ఈ దేశం వదిలి వెళ్లిపోండి.. అది కుదరకపోతే చచ్చిపోండి..’ అంటూ నారా రోహిత్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సురేంద్రనాథ్ బొల్లినేని, కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి మహతి స్వర సాగర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ ఏప్రిల్ లో ‘ప్రతినిధి 2’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Related Posts