సెకండ్ హీరోయిన్ గా పూజాహెగ్డే

నిన్నటి స్టార్ హీరోయిన్లే నేటి ఐటమ్ గాళ్స్ అనే సామెత టాలీవుడ్ లోనే కాదు.. ఏ వూడ్ లో అయినా వర్తిస్తుంది. అలాగే స్టార్ హీరోయిన్ గా వెలిగిన చోటే సెకండ్ హీరోయిన్ గా మారడం మాత్రం అప్పుడప్పుడూ జరుగుతుంది. ఇప్పుడు పూజాహెగ్డేకు జరిగింది.

అందుకు తన స్వయంకృతాపరాధమే కారణం అంటున్నారు. ఎందుకంటే పూజాహెగ్డే ఒకే క్యాంప్ కు ఎక్కువగా పరిమితం కావడంతో ఆఫర్స్ తగ్గాయి అనేది నిజం. మరోవైపు ఈ మధ్య కాలంలో తను నటించిన సినిమాలన్నీ పోయాయి. అటు బాలీవుడ్ లో సైతం ఒక్క హిట్టూ పడటం లేదు. దీంతో తన చేతిలో ఇప్పుడు కేవలం మహేష్ బాబు – త్రివిక్రమ్ ప్రాజెక్ట్ మాత్రమే ఉంది. ఇందులో తను మెయిన్ హీరోయిన్. మరో హీరోయిన్ గా శ్రీ లీల నటిస్తోంది.

అయితే ఇదే సీన్ తనకు రివర్స్ అయిందనే టాక్ వినిపిస్తోంది.
పవన్ కళ్యాణ్‌ – హరీష్‌ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న ”ఉస్తాద్ భగత్ సింగ్”లో ముందుగా అనుకున్న హీరోయిన్ పూజాహెగ్డేనే. అప్పుడు తను ఓకే చెప్పింది కూడా. బట్ ఈ ప్రాజెక్ట్ లేట్ అవుతూ వస్తుండటం..మొదలైందీ అనుకున్నప్పుడల్లా తనను అడగటం జరిగింది. ఓ దశలో ఇంక ఈ మూవీ స్టార్ట్ కాదేమో అని నో చెప్పిందట పూజాహెగ్డే. కట్ చేస్తే ఆ తర్వాత స్టార్ట్ అయింది. శ్రీ లీలను హీరోయిన్ గా ఫిక్స్ చేశారు.

అయితే ఈ మూవీ తమిళ్ లో వచ్చిన తెరి(తెలుగులో పోలీసోడుగా డబ్ అయింది) చిత్రానికి రీమేక్ కదా..? ఇందులో మరో హీరోయిన్ కూడా ఉంటుంది. అంటే తమిళ్ లో మెయిన్ హీరోయిన్ గా సమంత చేస్తే.. సెకండ్ హీరోయిన్ గా ఎమీ జాక్సన్ నటించింది. ఇప్పుడు ఈ ఎమీ జాక్సన్ పాత్రలోనే రెండో హీరోయిన్ గా పూజాహెగ్డేను తీసుకోవాలనుకుంటున్నారు.

ప్రస్తుతం చేతిలో పెద్దగా సినిమాలు కూడా లేవు కాబట్టి.. తను కూడా ఓకే చెప్పే అవకాశం ఉందంటున్నారు. అలా తన సినిమాలో సెకండ్ హీరోయిన్ చేతిలో మళ్లీ తను సెకండ్ హీరోయిన్ గా మారబోతోంది ఈ జిగేల్ రాణి.

Related Posts