యూవీ ప్రకటనను లైట్ తీసుకున్నారు

ఇవాళా రేపు ఒక సినిమాపై అంచనాలు పెంచడమే పెద్ద టాస్క్. అందుకోసం రకరకాల టాస్క్ లు చేస్తూ ఆడియన్స్ అటెన్షన్ ను గ్రాబ్ చేయాలని ప్రయత్నం చేస్తుంటారు మేకర్స్. ఇందుకోసం ఏమైనా చేస్తున్నారు. కొందర పాదయాత్రలు కూడా చేశారు. మరికొందరు జనాల్లోకి నేరుగా వెళ్లి మేం ఎవరో తెలుసా.. మా సినిమా చూస్తారా అని ప్రశ్నించి అరే ఇంత సింపుల్ గా ఉన్నారే అని ప్రేక్షకుల చేత అనిపించుకుని ఆకట్టుకున్నారు.

ఇవన్నీ చిన్న సినిమాలకు ఎక్కువగా వచ్చే పెద్ద సమస్యలు. బట్ అనౌన్స్ మెంట్ తోనే ఆకట్టుకుని.. ఒక్కో అప్డేట్ తో అంచనాలు పెంచిన సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం కాంబినేషన్ తో క్రేజ్ తెచ్చుకుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించడంతో క్వాలిటీ పరంగానూ తిరుగుండదు అనుకున్నారు. సమ్మర్ లో విడుదలయ్యే అవకాశాలున్నాయి అని చాలామంది భావించారు. అలా ఏప్రిల్, మే వెళ్లిపోయాయి. పోనీ జూన్ లో వస్తారు అంటే జూలైలో ఆగస్ట్ 4న వస్తున్నాం అని అనౌన్స్ చేశారు. కానీ అప్పటికే సినిమాపై ఆసక్తి పోయింది. ఉన్న కొంతమంది కూడా ఇదైనా నమ్మొచ్చా అని డౌట్స్ వెలిబుచ్చారు. ఆ స్థాయిలో తమ చిత్రానికి వచ్చిన క్రేజ్ ను దగజార్చుకుంది యూవీ క్రియేషన్స్ బ్యానర్.


ఇక ఆగస్ట్ దగ్గరకు వస్తున్నా కొద్దీ ఆడియన్స్ కు అర్థమైపోయింది. ఈ సినిమా ఆగస్ట్ 4న కూడా రావడం లేదు అని ఫిక్స్ అయిపోయారు. అందుకు కారణం .. ఈ మధ్య రిలీజ్ కు నెల రోజుల ముందు నుంచే సందడి మొదలవుతుంది. బట్ వీళ్లు మాత్రం కనీసం పది రోజుల ముందు కూడా ప్రమోషనల్ యాక్టివిటీ స్టార్ట్ చేయలేదు. దీంతో జనం పూర్తిగా లైట్ తీసుకున్నారీ చిత్రాన్ని.

ఇక చావుకబురు చల్లగా అన్నట్టు మేం వాయిదా వేశాం. త్వరలోనే ట్రైలర్ తో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం అని యూవీ బ్యానర్ అనౌన్స్ చేసింది. బట్ దీన్ని ఎవరూ సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించడం లేదు. అది మేం ఊహించిందే కదా అన్నట్టుగా ఉన్నారు. ఏదేమైనా ఫ్రీగా వచ్చిన హైప్ ను ఇలా చేతులారా చేజార్చుకోవడం యూవీ వారికి మాత్రమే సాధ్యమయ్యే విషయం అంటూ టాలీవుడ్ లో సెటైర్స్ కూడా పడుతున్నాయి.

Related Posts