ధనుష్ కు రెడ్ కార్డ్ ఇష్యూ చేయనున్న కోలీవుడ్

స్టార్ హీరో ధనుష్‌ ప్యాన్ ఇండియన్ స్టార్ గా మారాడు. వరుసగా అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఆ మధ్య మొదటి సారిగా తెలుగులో సార్ అనే మూవీతో వచ్చాడు. ఈ మూవీ మిక్స్ డ్ రిజల్ట్ తెచ్చుకున్నా.. తర్వాత శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో మరో సినిమా ప్లానింగ్ లో ఉంది. ప్రస్తుతం అరుణ్‌ మాతేశ్వరన్ డైరెక్షన్ లో కెప్టెప్ మిల్లర్ అనే సినిమా చేస్తున్నాడు.

ఇది లోకేష్ కనకరాజ్ సినీ వర్స్ లా రెండు మూడు భాగాలుగా ఉంటుందని చెబుతున్నారు. దీంతో పాటు రీసెంట్ గా తనకు బాలీవుడ్లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్ లో తేరే ఇష్క్ మే అనే సినిమా అనౌన్స్ అయింది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో 2013లో వచ్చిన రాంఝనా బ్లాక్ బస్టర్ అయింది. ఈ మూవీతోనే ధనుష్‌ డైరక్ట్ గా హిందీ ఆడియన్స్ కు పరిచయం అయ్యాడు.

ఈ చిత్రానికి బెస్ట్ యాక్టర్ గా ఐఫా అవార్డ్ తో పాటు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ను కూడా అందుకున్నాడు ధనుష్. రాంఝనాలో కుందన్ శంకర్ అనే పాత్రలో నటించాడు ధనుష్‌. ఇప్పుడు ఆ పాత్రకు కొనసాగింపుగానే ఈ తేరే ఇష్క్ మే చిత్రం ఉంటుందని రీసెంట్ గా అనౌన్స్ అయినప్పుడు అందరికీ తెలిసింది.


ఇలా వరుస ప్రాజెక్ట్ తో దూకుడుగా ఉన్న ధనుష్ పై కోలీవుడ్ నిర్మాతలు కన్నెర్ర చేశారు. అంతే కాదు.. అతనికి రెడ్ కార్డ్ ఇష్యూ చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. అందుకు కారణం.. అతను గతంలో ఒప్పుకున్న తమిళ చిత్రాలను అస్సలు పట్టించుకోవడం లేదట. ఆ నిర్మాతలను ఇబ్బందులకు గురి చేస్తూ బయటి భాషల్లో సినిమాలు చేస్తున్నాడు అనేదే ప్రధాన కారణంగా చెబుతున్నారు.

ఇలా చేస్తే తెలుగులో అయితే ఎవరూ పట్టించుకోరు. కానీ తమిళ్ లో కనీసం సౌండ్ అయినా చేస్తారు నిర్మాతలు. తమ ఆవేదనను అందరూ కలిసి వెలిబుచ్చుతారు. అందుకే ఇంతకు ముందు స్టార్ హీరోస్ విశాల్, శింబుతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సూర్య పై కూడా రెడ్ కార్డ్ జారీ చేశారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి ధనుష్ కూడా చేరాడు.

మరి ఈ రెడ్ కార్డ్ ఇష్యూ పై ధనుష్ వెర్షన్ఎలా ఉంటుందో కానీ.. సొంత భాషల నిర్మాతలను ఇబ్బంది పెడుతూ బయటి భాషల్లో సినిమాలు చేయడం ఏమంత గొప్పదనం అనిపించుకోదు. ఇప్పుడు వీళ్లకు బయటి నుంచి అంత రెస్పాన్స్ వస్తుందంటే కారణం.. ఇప్పటి వరకూ చేసిన సొంత భాషా చిత్రాలే కదా కారణం. మరి దాన్ని వదిలి ఇతరులను ఎంకరేజ్ చేయడం అంటే దాన్ని ఏమనాలో ఆయా హీరోలే నిర్ణయించుకోవాలి.

Related Posts