ఖుషీ బుకింగ్స్ ఓపెన్

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషీ మూవీ రెండు రోజుల్లో విడుదల కాబోతోంది. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ బ్యానర్ నిర్మించింది. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. బిజినెస్ పరంగానూ విజయ్, సమంతల గత సినిమాల ప్రభావం అస్సలు లేకుండా భారీగా జరిగింది. ఇది విశ్లేషకులను కూడా ఆశ్చర్యపరచింది.

ముఖ్యంగా ఈ కపుల్ పై ఉన్న క్రేజ్ తో పాటు ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అనిపించుకున్న పాటలు, ముందు నుంచీ సినిమాకు ఎసెట్ గా నిలిచాయి. యేడాది పాటు ఆలస్యం అయినా కూడా ఈ మూవీపై మొదట్నుంచీ ఒక పాజిటివ్ వైబ్ ఉంది. అది బిజినెస్ కు బాగా హెల్ప్ అయింది. శివ నిర్వాణ గత చిత్రం టక్ జగదీష్ నిరాశపరిచినా.. అతను సెన్సిబుల్ సినిమాలు తీయడంలో ఎక్స్ పర్ట్ అనే ముద్ర మొదటి రెండు సినిమాలకు వచ్చింది. అది కూడా ఖుషీకి ప్లస్ అయింది.


ఇంత క్రేజ్ ఉన్న సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో కాస్త ఆలస్యం అయింది. దీంతో అసలేం జరుగుతందా అని అభిమానుల్లో ఓ ఆందోళన కనిపించింది. బట్ ఫైనల్ గా ఈ బుధవారం ఉదయం 10 గంటల నుంచి అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయ్యాయి. ఇలా స్టార్ట్ అయ్యాయో లేదో అలా హాట్ కేక్స్ లా అయిపోతున్నాయి. అంటే ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంత ఈగర్ గా ఎదురుచూస్తున్నారు అనేది అర్థం చేసుకోవచ్చు.

ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావాలని బలంగా కోరుకుంటున్నారు. సినిమాకూ ఆ కలర్స్ బాగా కనిపిస్తున్నాయి. అందుకే వాళ్లూ గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈ సారి విజయ్ బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అనుకుంటున్నారు. సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోన్న ఖుషీతో ఆ నెలలో వచ్చే భారీ సినిమాలన్నిటికీ ఒక ఊపు వస్తుందని భావిస్తున్నారు.

Related Posts