ఇద్దరు మిత్రులు బద్ద శత్రువులైతే.. అదే ‘సలార్’

‘సలార్’ స్టోరీ లైన్ పై క్లారిటీ వచ్చేసింది. ఇప్పటివరకూ ఈ సినిమా కథ ఇదని.. అదని.. పలు కథనాలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే.. లేటెస్ట్ గా ఈ మూవీ సెంట్రల్ థీమ్ పై ఓ క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇద్దరు మంచి మిత్రులు.. బద్ధ శత్రువులుగా మారడమే ‘సలార్’ కథ అని చెప్పేశాడు. వాళ్ల చుట్టూ ఉండే పరిస్థితుల నేపథ్యంలోనే ఆ మిత్రులు శత్రువులుగా మారాల్సి వస్తోందని అన్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.

మొదటి భాగం ‘సలార్ సీజ్ ఫైర్’లో ప్రభాస్, పృథ్వీరాజ్ కు సంబంధించిన స్నేహమే ప్రధానంగాసాగనుందట. వారి స్నేహ గాఢతను తెలియజేసాలా ఎంతో ఎమోషన తో కూడిన సన్నివేశాలు ప్రేక్షకులను అలరించనున్నాయట. ఇక.. స్నేహితులు విడిపోయిన దగ్గర ఫస్ట్ పార్ట్ కి ఎండ్ కార్డ్ పడనుందని తెలుస్తోంది. అలాగే ‘సలార్, కె.జి.యఫ్’కి సంబంధం లేదని.. ఇవి రెండూ డిఫరెంట్ వరల్డ్స్ అంటున్నాడు ప్రశాంత్ నీల్. డిసెంబర్ 1న ‘సలార్’ ట్రైలర్ వస్తే.. స్టోరీపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గా ‘సలార్ ఫస్ట్ పార్ట్.. సీజ్ ఫైర్’ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Related Posts