‘పుష్ప 2’ని ఆకాశానికెత్తేస్తున్న దేవిశ్రీ

కొన్ని కాంబినేషన్స్ లో రూపొందే సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అలాంటి కాంబో అల్లు అర్జున్-సుకుమార్-దేవిశ్రీ ప్రసాద్. ‘ఆర్య’తో మొదలైన వీరి ముగ్గురి ప్రస్థానం.. ఆ తర్వాత ‘ఆర్య 2, పుష్ప 1’తో పీక్స్ కు చేరింది. ఇప్పుడు ‘పుష్ప 2’తో వీరు సృష్టించే సంచలనాలు మరో రేంజులో ఉండబోతున్నాయనే ప్రచారం జరుగుతుంది. ‘పుష్ప 1’ పాన్ ఇండియా లెవెల్ లో భారీ విజయాన్ని సాధించడంతో.. ‘పుష్ప 2’ని అత్యంత భారీ బడ్జెట్ తో సమ్ థింగ్ స్పెషల్ గా తీర్చిదిద్దుతున్నాడట సుకుమార్.

లేటెస్ట్ గా ‘పుష్ప 2’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్‌. సుకుమార్ అంటేనే స్క్రీన్ ప్లే మాంత్రికుడు. ఇక.. ‘పుష్ప 2’ చిత్రాన్ని సుక్కూ చాలా బ్రిలియంట్ గా తీర్చిదిద్దుతున్నాడని ఇటీవలే ఓ ఇంటర్యూలో వెల్లడించాడు దేవిశ్రీ. ప్రతీ సీక్వెన్స్ భారీ స్థాయిలో ఉంటుందని.. ఇదే ఇంటర్వెల్ అన్నంత లెవెల్లో ఆ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని ‘పుష్ప 2’ని ఆకాశానికెత్తేశాడు డి.ఎస్.పి. ప్రస్తుతం ‘పుష్ప 2’కి సంబంధించిన కీలకమైన షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాలో వచ్చే ఓ జాతర సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు.

మరోవైపు బన్నీ, సుకుమార్, దేవిశ్రీ కాంబో సినిమా అంటేనే ఐటెమ్ నంబర్ ఎంత పెద్ద హిట్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదటి భాగంలోని ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా‘కి మించిన రీతిలో రెండవ భాగంలోనూ ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందట.

Related Posts