కాంతార ప్రీక్వెల్ పై బిగ్ అప్డేట్

కాంతార.. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి విడుదలైన అన్ని భాషల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం. కన్నడ పరిశ్రమలో కేవలం 20 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ రివ్యూస్ తర్వాత అన్ని భాషల్లోనూ డబ్బింగ్ రైట్స్ తీసుకున్నారు. తీసుకున్న ప్రతి ఒక్కరూ మూడు నాలుగు రెట్లు లాభాలు చూశారు. ఓవరాల్ గా 400 కోట్ల వరకూ కలెక్షన్స్‌ వసూలు చేసి కన్నడ పరిశ్రమలో కేజీఎఫ్ తర్వాతి స్థానంలో నిలిచింది.

విశేషం ఏంటంటే ఈ చిత్రాన్ని నిర్మించింది కూడా కేజీఎఫ్ నిర్మాతలే. ఈ చిత్రానికి ప్రధాన బలం కథ, దర్శకత్వంతో పాటు దర్శకత్వం చేస్తూనే హీరోగా నటించిన రిషభ్ శెట్టి నటన. అతని నటనకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఎంతోమంది హీరోలు ఇలాంటి పాత్రలు తమకెందుకు రాలేదు అని ఫీలయ్యారు. ఆ రేంజ్ లో ఆ పాత్రను రక్తి కట్టించాడు. సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు.

కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించే పంజుర్లి, భూతకోల సంస్క్రుతి సంప్రదాయాల నేపథ్యంలో వచ్చిందీ చిత్రం. 2022లో హయ్యొస్ట్ కలెక్షన్స్ సాధించిన మూడో భారతీయ సినిమాగా నిలిచింది అంటే కారణం దర్శకత్వ ప్రతిభే అని చెప్పక తప్పదు. అయితే ఈ మూవీ బ్లాక్ బస్టర్ తర్వాత కాంతారకు ప్రీక్వెల్ తీస్తాను అని ప్రకటించాడు హీరో, డైరెక్టర్ రిషభ్ శెట్టి. అప్పట్లో అది చాలామంది నిజం అనుకోలేదు.

కానీ గత ఉగాది రోజు ఈ ప్రీక్వెల్ కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొదలుపెడుతున్నా అంటూ తను నటించిన పాత్రలాంటి వ్యక్తి వద్దే ప్రకటించాడు. ఇక ఇన్ని రోజుల తర్వాత పూర్తి బౌండ్ స్క్రిప్ట్ రెడీ అయిందట. దీంతో కాంతార ప్రీక్వెల్ కు సంబంధించిన షూటింగ్ అప్డేట్ ను కూడా ప్రకటించింది హొంబలే ఫిల్మ్స్ సంస్థ.


ఈ యేడాది ఆగస్ట్‌ 27 నుంచి కాంతార ప్రీక్వెల్ షూటింగ్ స్టార్ట్ అవుతుందట. ఆ డేటే ఎందుకు అంటే ఈ మూవీలో కొంత పోర్షన్ వర్షంలోనే ఉంటుందట. దీనికోసం సహజమైన వర్షంలోనే చిత్రీకరణ చేయాలని ఆగస్ట్ నుంచి ఒక అడవిలో చిత్రీకరణ ప్లాన్ చేసుకున్నారు. ఇది ప్రీక్వెల్ కాబట్టి ఫస్ట్ పార్ట్ గానే చూడాలి. సెకండ్ పార్ట్ గా కాంతార వచ్చింది కాబట్టి.. ఈ మొదటి భాగాన్ని వచ్చే యేడాది ఉగాదికి విడుదల చేసేలా షూటింగ్ ఉంటుందని టాక్.

మొత్తంగా రిషభ్ శెట్టికి ఈ ప్రీక్వెల్ తీయాలనే థాట్ కాంతార షూటింగ్ చేస్తున్నప్పుడే వచ్చిందట. కానీ అప్పుడు చెబితే నిర్మాతలు ఏమంటారో అని ఆగాడు. రిజల్ట్ చూసిన తర్వాత నిర్మాతలతో చర్చించడం వారు వెంటనే ఓకే చెప్పడంతో ఈ ఫస్ట్ పార్ట్ కు శ్రీకారం చుట్టాడు. మరి కాంతారలోనే చాలా విషయాలు చెప్పిన రిషభ్ శెట్టి.. ఈ ప్రీక్వెల్ లో అంతకు మించిన ఇంట్రెస్టింగ్ గా ఇంకే విషయాలు చెబుతాడా అనే ఆసక్తి అందర్లోనూ ఉంది.

పైగా ఇప్పుడు అంచనాలు భారీగా ఉంటాయి. వాటిని అందుకోవడం అంత సులభం కాదు. ఏ మాత్రం తేడా వచ్చినా ఫస్ట్ పార్ట్ ను మర్చిపోయి మరీ రిషభ్ ను విమర్శిస్తారు. సో అతను చాలా చాలా జాగ్రత్తగా ఈ చిత్రాన్ని రూపొందించాల్సి ఉంటుంది.

Related Posts