ఈ మధ్యాహ్నం రమేష్ బాబు అంత్యక్రియలు

శనివారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూసిన కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు జుబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు రమేష్ బాబు పార్థివ దేహాన్ని పద్మాలయ స్టూడియోస్ లో బంధు మిత్రుల సందర్శనార్థం ఉంచుతారు. అక్కడి నుంచి ఆయన అంతిమయాత్ర ప్రారంభం కానుంది.

కోవిడ్ నిబంధనల దృష్ట్యా అభిమానులు, ఇతరులు పెద్ద సంఖ్యలో రావొద్దని కృష్ణ కుటుంబ సభ్యులు కోరారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, మా శ్రేయోభిలాషులందరినీ కోవిడ్ నిబంధనలకు కట్టుబడి, దహన సంస్కారాల స్థలంలో గుమికూడకుండా ఉండాలని మేము అభ్యర్థిస్తున్నామని ఘట్టమనేని ఫ్యామిలీ ఓ ప్రకటనలో తెలిపారు.

Related Posts