బాలయ్య సక్సెస్ మంత్ర ఎవరో తెలుసా…

ఆహా ఓటీటీ కోసం బాలకృష్ణ చేస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్ సూపర్ సక్సెస్ అయ్యింది. ఆహా ఓటీటీకి ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. బాలకృష్ణ తో టాక్ షో అంటే రిజల్ట్ ఎలా ఉంటుందో అని భయపడిన ఆహా టీమ్ మెంబర్స్ ఆశ్చర్యపోయేంత విజయవంతమైంది అన్ స్టాపబుల్. బాలకృష్ణకున్న క్రేజ్ వల్ల ఈ కార్యక్రమంలో ఎంతో మంది స్టార్స్ పాల్గొన్నారు. మోహన్ బాబు, రవితేజ, అల్లు అర్జున్, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ..ఇలా చాలా మంది స్టార్స్ అన్ స్టాపబుల్స్ లో గెస్ట్ లుగా పాల్గొని సందడి చేశారు. ఈ షో టైమ్ లో ఇప్పటిదాకా బాలకృష్ణ స్పందించని పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలపైనా మాట్లాడి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు.

బయటికి కనిపించే కారణాలు బాలకృష్ణ క్రేజ్, ఫస్ట్ టైమ్ టాక్ షో చేయడం, పెద్ద స్టార్స్ గెస్టులుగా రావడం అయితే తెర వెనుక ఈ షో హిట్ అయ్యేందుకు మరో కారణం ఉంది. అదేంటంటే బాలకృష్ణ చిన్నకూతురు తేజస్విని ఈ టాక్ షోకు క్రియేటివ్ కన్సల్టెంట్ గా ఉంటూ షోను ఇంత బాగా వచ్చేందుకు ప్రయత్నించింది.

ఫస్ట్ టైమ్ టాక్ షో చేస్తున్నారు కాబట్టి బాలకృష్ణ కూడా దీన్నొక ఎక్సీపిరియన్స్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే రెమ్యునరేష్ కూడా చాలా తక్కువగా అంటే ఎపిసోడ్ కు 25 లక్షల రూపాయలు తీసుకున్నారట. మొత్తంగా 2.5 కోట్ల రూపాయలు అన్ స్టాపబుల్ షో ద్వారా బాలకృష్ణకు దక్కాయి. ఈ ఫస్ట్ సీజన్ హిట్ అయినందువల్ల రాబోయే సెకండ్ సీజన్ కు రెట్టింపు రెమ్యునరేషన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి.