దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఏపీ ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. ఆన్ లైన్ టికెటింగ్ విధానం వల్ల పెద్ద మార్పేమీ రాదని ఆయన అభిప్రాయపడ్డారు. టికెట్ రేట్లను తొలి రోజు పెంచుకోనివ్వడం ద్వారా టాక్స్ పెరిగి ప్రభుత్వానికి అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని, ఈ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని రాఘవేంద్రరావు సూచించారు.
అసలే 20 శాతం సక్సెస్ రేటుతో కొట్టుమిట్టాడుతున్న తెలుగు చిత్ర పరిశ్రమను మరింత నష్టపోయేలా చేయొద్దని, ఇక్కడ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న వారి గురించి ఆలోచించాలని రాఘవేంద్రరావు తాజా ప్రకటనలో పేర్కొన్నారు.