రోశయ్యకు మోహన్ బాబు నివాళి

సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ సీఎం రోశయ్య మృతికి మోహన్ బాబు సంతాపాన్ని వ్యక్తం చేశారు.

మోహన్ బాబు స్పందిస్తూ
రాజకీయాన్నిశ్వాసగా, అవపోసన పట్టి, రాజకీయ భాషను కొత్త పుంతలు తొక్కించి, అప్రతిహతఘటనా సమర్ధులైన రాజకీయ భీష్ములు, రాజకీయ దురంధురులు కొణిజేటి రోశయ్యగారు ఆకస్మికంగా భువి నుంచి దివికేగడం తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింది. ముఖ్యమంత్రిగా వారు ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేనివి. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని ముక్కోటి దేవతలను కోరుకుంటున్నాను. అని పేర్కొన్నారు

Related Posts