ఒకరూ ఇద్దరూ కాదు, ఏకంగా ముగ్గురు మెగా డైరక్టర్లలో ఇప్పుడు టెన్షన్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వరుసగా మూడు అకేషన్లకు ఖర్చీఫులు వేసి కూర్చున్న ఆ ముగ్గురూ మరెవరో కాదు.. మెగాస్టార్తో సినిమాలు చేస్తున్న డైరక్టర్లు.
తమిళ డైరక్టర్ మోహన్రాజాది అందులో మేజర్ టెన్షన్. ఆల్రెడీ మలయాళంలో సూపర్డూపర్ సక్సెస్ అయిన లూసిఫర్ సినిమాను తెలుగులో వండివారుస్తున్నాడు మోహన్రాజా. ఈ మధ్య రిలీజ్చేసిన టీజర్కి మిక్స్డ్ రెస్పాన్సే వస్తోంది. మరీ తీసేయదగ్గట్టూ లేదు, అలాగని ఒరిజినల్నీ మరిపించేటట్టూ లేదంటూ మిశ్రమ స్పందన చెబుతున్నారు క్రిటిక్స్. ఈ సినిమా దసరాకు రిలీజ్ ఫిక్స్.
ఈ ఇయర్ ఆచార్యతో కొరటాల ఇచ్చిన ఫ్లాప్ డ్యామేజ్ నుంచి మెగాస్టార్ ని ఇమీడియేట్గా బయటపడేయాల్సిన బాధ్యత మాత్రం మోహన్రాజాదే.నెక్స్ట్ ఇయర్ ఈ బరువు మోయడానికి రెడీ అవుతున్నారు బాబీ అండ్ మెహర్ రమేష్. వాల్తేరు వీరయ్య సినిమా మీద మనవాళ్లతో పాటు కోలీవుడ్ కూడా అంచనాలు పెంచేసుకుంటుంది. అటు భోళాశంకర్ అయితే ఫక్తు ఫ్యామిలీ సినిమా అని ఆడియన్స్ అంతా ఫిక్సు.
లైగర్లాగా ఓవర్ హైప్ క్రియేట్ చేయకుండా, డీసెంట్ సక్సెస్ ఇస్తేగానీ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కూల్ అయ్యేటట్టు లేరు. అంటే, ఇప్పుడు ఆ డీసెంట్ హిట్ ఇవ్వాల్సిన బాధ్యత మాత్రం ఈ కెప్టెన్స్ మీదే ఉంది. అందుకే స్క్రిప్టులు, స్క్రీన్ప్లేలు, డైలాగులను రీచెక్ చేసుకుంటున్నారన్న టాక్ బలంగా వినిపిస్తోంది.