డైరెక్ష‌న్‌పై మ‌న‌సు ప‌డ్డ మెగా మేన‌ల్లుడు..

మెగా ఫ్యామిలీ ప‌ది మంది హీరోలున్నారు. వారిలో రీసెంట్‌గా ఇంట్ర‌డ్యూస్ అవ‌ట‌మే కాకుండా తొలి చిత్రం ఉప్పెన‌తోనే బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన హీరో వైష్ణ‌వ్ తేజ్ .. ‘రంగ రంగ వైభవంగా’ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రానున్న సెప్టెంబ‌ర్ 2న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో వైష్ణ‌వ్ బిజీగా ఉన్నారు. రీసెంట్ ఇంట‌ర్వ్యూలో వైష్ణ‌వ్ తేజ్ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని చెప్పారు. అదేంటంటే వైష్ణ‌వ్ తేజ్‌కు న‌ట‌తో పాటు డైరెక్ష‌న్ కూడా చేయాల‌నుంద‌ట‌. ఇప్ప‌టికే ఓ మ‌ల్టీస్టారర్ క‌థ‌ను సిద్ధం చేసుకున్నార‌ట‌. అన్ని స‌రిగ్గా కుదిరితే.. అన్న‌య్య సాయిధ‌ర‌మ్ తేజ్.. బావ వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్‌లో స‌ద‌రు మ‌ల్టీస్టార‌ర్ సినిమాను చేయాల‌ని అనుకుంటున్నార‌ట వైష్ణ‌వ్‌. మ‌రి ఈ యంగ్ హీరో.. డైరెక్ట‌ర్‌గా మారెదెప్పుడో చూడాలి.

ఇక ‘రంగ రంగ వైభ‌వంగా’ సినిమా విష‌యానికి వ‌స్తే.. వైష్ణవ్ తేజ్ ఇంత‌కు ముందు చేసిన ఉప్పెన‌, కొండ‌పొలం చిత్రాల‌కు భిన్నంగా చేశాడు. ఇద్ద‌రు వ్య‌క్తులు ఇగోల కార‌ణంగా వారి ప్రేమ‌ను వ్య‌క్తం చేసుకోరు. వారి ప్రేమ ప్ర‌యాణంలో ఎదుర‌య్యే అనుభ‌వాలేంటనేదే సినిమా. వైష్ణ‌వ్ తేజ్ స‌ర‌స‌న కేతికా శ‌ర్మ హీరోఇయ‌న్‌గా న‌టిస్తుంది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందించారు. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు, టీజ‌ర్‌, ట్రైల‌ర్ సినిమాపై మంచి అంచ‌నాల‌ను పెంచాయి. ఉప్పెన త‌ర్వాత వ‌చ్చిన‌ కొండ‌పొలం చిత్రం ఆశించిన స్థాయిలో స‌క్సెస్ కాలేదు. మ‌రి రంగ రంగ వైభ‌వంగా సినిమాతో మంచి స‌క్సెస్ కొట్టాల‌ని వైష్ణ‌వ్ తేజ్ ఎదురు చూస్తున్నారు.

Related Posts