కొడుకు రమేష్ బాబు మృతిని తట్టుకోలేకపోయిన కృష్ణ

కన్నీటి వీడ్కోల మధ్య నటుడు, నిర్మాత రమేష్ బాబు అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. పద్మాలయ స్టూడియోస్ లో ఉదయం రమేష్ బాబు భౌతిక కాయాన్ని పలువురు సినీ ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించారు. కొడుకు భౌతిక కాయాన్ని చూసి కృష్ణ కన్నీటి పర్యంతం అయ్యారు. పక్కనే ఉన్న కోడలు మృదుల, మనవరాలును దగ్గరకు తీసుకుని ఓదార్చారు కృష్ణ. కొడుకు మరణాన్ని తట్టుకోలేకపోయారు కృష్ణ. కన్నీళ్లతో భారంగా కదులుతూ కొడుకుకు వీడ్కోలు చెప్పారు.

అనంతరం కొద్ది సేపటికి అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఘట్టమనేని కుటుంబ సభ్యులు, పరిమిత సంఖ్యలో బంధు మిత్రులు ఈ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. కరోనా సోకిన కారణంగా మహేష్ బాబు కుటుంబం అంత్యక్రియలకు దూరంగా ఉన్నారు. జుబ్లీ హిల్స్ మహాప్రస్థానంలో రమేష్ బాబు అంత్యక్రియలు పూర్తిచేశారు.