చాందిని చౌక్ లో.. “హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు”

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, విభిన్న క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు క్రిష్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ పిరియాడిక్ మూవీ హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు. ఇందులో ప‌వ‌ర్ స్టార్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ న‌టిస్తుంది. సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ ఎ.ఎం.ర‌త్నం ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. దాదాపుగా 150 కోట్ల భారీ బ‌డ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది. ఇది ప‌వన్ క‌ళ్యాణ్ కి ఫ‌స్ట్ పాన్ ఇండియా మూవీ కావ‌డం విశేషం.

ఈ మూవీ మొగ‌లాయిల కాలం నేప‌ధ్యంలో రూపొందుతోంది. అప్ప‌టి వాతావ‌ర‌ణం ప్ర‌తిబింబించేలా సెట్స్ ను భారీగా రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే చాందిని చౌక్ సెట్ నిర్మించే ప్ర‌య‌త్నాలు ప్రారంభ‌మ‌య్యాయి. కొత్త షెడ్యూల్ ను ఈ చాందిని చౌక్ లోనే చిత్రీక‌రించ‌నున్నార‌ని తెలిసింది. ఇందులో బాలీవుడ్ తార‌లు అర్జున్ రాంపాల్, న‌ర్గీస్ ఫ‌క్రీ న‌టిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో ప్రేక్ష‌కుల ముందుకు రావాలి కానీ.. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది.

Heritage Chandni Chowk opens in new avatar | Latest News Delhi - Hindustan Times

స‌మ్మ‌ర్ లో ఏప్రిల్ లో రిలీజ్ చేయ‌నున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు కానీ…. ఇప్పుడు క‌రోనా థ‌ర్డ్ వేవ్ కార‌ణంగా సినిమా షూటింగ్ మ‌రింత ఆల‌స్యం అవుతుంది. అందుచేత మ‌రోసారి ఈ హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు వాయిదా ప‌డ‌డం ఖాయ‌మ‌ని టాక్ వినిపిస్తోంది. మ‌రి… ఎప్పుడు హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Related Posts