పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విభిన్న కథా చిత్రాల దర్శకుడు క్రిష్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ పిరియాడిక్ మూవీ హరిహర వీరమల్లు. ఇందులో పవర్ స్టార్ సరసన నిధి అగర్వాల్ నటిస్తుంది. సీనియర్ ప్రొడ్యూసర్ ఎ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దాదాపుగా 150 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది. ఇది పవన్ కళ్యాణ్ కి ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడం విశేషం.
ఈ మూవీ మొగలాయిల కాలం నేపధ్యంలో రూపొందుతోంది. అప్పటి వాతావరణం ప్రతిబింబించేలా సెట్స్ ను భారీగా రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే చాందిని చౌక్ సెట్ నిర్మించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కొత్త షెడ్యూల్ ను ఈ చాందిని చౌక్ లోనే చిత్రీకరించనున్నారని తెలిసింది. ఇందులో బాలీవుడ్ తారలు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ నటిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాలి కానీ.. కరోనా కారణంగా వాయిదా పడింది.
సమ్మర్ లో ఏప్రిల్ లో రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు కానీ…. ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్ కారణంగా సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అవుతుంది. అందుచేత మరోసారి ఈ హరి హర వీరమల్లు వాయిదా పడడం ఖాయమని టాక్ వినిపిస్తోంది. మరి… ఎప్పుడు హరి హర వీరమల్లు ప్రేక్షకుల ముందుకు వస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.