అక్షర సూరీడుకి ఆఖరి వీడ్కోలు

తెలుగు పాటకు గౌరవాన్ని తెచ్చిన దిగ్గజ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి చిత్రపరిశ్రమ కడసారి వీడ్కోలు చెబుతోంది. నిన్న అనారోగ్యంతో కన్నుమూసిన సిరివెన్నెల పార్దివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఫిలించాంబర్ ప్రాంగణంలో ఉంచారు. ఇక్కడికి అనేక మంది సినీ ప్రముఖులు, అభిమానులు వచ్చి చివరిసారి చూసి, నివాళులు అర్పించారు.

మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాని, అల్లు అర్జున్, తివిక్రమ్, నటులు రావు రమేష్, తనికెళ్ల భరణి, సంగీత దర్శకుడు మణిశర్మ, రచయిత బుర్రా సాయి మాధవ్, దర్శకులు మారుతి, నటుడు సాయి కుమార్ తదితరులు సిరివెన్నెలకు నివాళులు అర్పించారు. 10.30 గంటల వరకు సీతారామశాస్త్రి భౌతిక కాయాన్ని ఫిలింఛాంబర్ లో సందర్శనార్థం ఉంచనున్నారు. ఆ తర్వాత అంత్యక్రియలను జుబ్లీ హిల్స్ మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు.

Related Posts