భారతదేశపు మొట్టమొదటి మడ్ రేస్ చిత్రం `మడ్డి`. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ప్రై.లి పతాకంపై డిసెంబర్10న దిల్రాజు విడుదల చేస్తున్నారు. కొత్త కాన్సెప్ట్ , దర్శకుడిలో సినిమా మీద ప్యాషన్ చూసి మడ్డి చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు నిర్మాత దిల్ రాజు. కొత్త టైప్ ఆఫ్ సినిమా కాబట్టే బురదలోకి (మడ్డి సినిమాను ఉద్ధేశించి) దిగానని అన్నారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ సందర్భంగా
దిల్రాజు మాట్లాడుతూ – “మడ్డి సినిమా మేకింగ్ వీడియోలు మరియు టీజర్, ట్రైలర్ చూడగానే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. అందుకే ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నాను. మేకింగ్ చాలా కొత్తగా ఉంటుంది. ప్యాన్ ఇండియా మూవీగా విడుదలవుతున్న మడ్డి అన్ని భాషల్లో సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది“ అన్నారు.
దర్శకుడు డా. ప్రగభల్ మాట్లాడుతూ – “ఒక యూనిక్ మూవీని ప్రేక్షకులకు అందించాలని మా టీమ్ అందరం ఐదేళ్లు కష్టపడి ఈ మూవీని తెరకెక్కించాం. ఆఫ్ రోడ్ మడ్ రేస్ అనేది భారతదేశంలో కొత్త కానెప్ట్ కాబట్టి ప్రీ ప్రొడక్షన్, మేకింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఈ మూడు స్టేజెస్లో చాలా కష్టపడాల్సి వచ్చింది. తప్పకుండా ప్యాన్ ఇండియా స్థాయిలో విజయం సాధిస్తుంది“ అన్నారు