ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప. అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియన్ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. మొదటి భాగం పుష్ప ది రైజ్ పేరుతో డిసెంబర్ 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో సమంత ఊ అంటావా.. ఊఊ అంటావా అనే స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో దూసుకుంటూ వెళుతుంది. సరికొత్త రికార్డులను షేక్ చేస్తుంది.
ఇదిలా ఉంటే… తాజాగా ఈ సాంగ్ పై ఓ వివాదం రేగింది. మగవాళ్ల బుద్ధే వంకర బుద్ధి అనే లిరిక్స్ ఈ పాటలో ఉన్నాయని, ఈ పాట మగవాళ్ల పై తప్పుడు అభిప్రాయం కలిగించేలా ఉందని ఆంధ్రప్రదేశ్ పురుషుల సంఘం కేసు వేసింది. మగవాళ్లు కేవలం కామంతోనే ఉంటారనే అర్థం వచ్చేలా ఈ పాట ఉందని.. ఆ పాటలోని పదాలతో అలాంటి భావమే వస్తుందని అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతే కాకుండా ఈ పాట పై నిషేదం విధించాలంటూ పురుషుల సంఘం ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. మరి.. హైకోర్ట్ ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.