పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. అతని ఫ్రెండ్స్ కలిసి నెల్లూరు జిల్లా సూళ్లురు పేటలో వి ఎపిక్ పేరుతో మల్టీప్లెక్స్ స్టార్ట్ చేశారు. ఇది దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద స్ర్కీన్. ఆమధ్య ఈ మల్టీప్లెక్స్ ను సినీ ప్రముఖులు చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు సక్సస్ ఫుల్ గా రన్ అయ్యింది. ప్రభాస్ భారీ చిత్రం రాధేశ్యామ్ ఈ థియేటర్లో రిలీజ్ చేయాలనుకుంటే.. ఈ మల్టీప్లెక్స్ మూతపడడం ప్రబాస్ అండ్ ఫ్రెండ్స్ కి బిగ్ షాక్ అని చెప్పచ్చు.
ఇంతకీ విషయం ఏంటంటే… ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్ల రేటు తగ్గించడం.. ప్రమాణాలు పాటించడం లేదంటూ థియేటర్లో తనిఖీలు చేయడం.. కొన్నింటిని సీజ్ చేస్తుండడం తెలిసిందే. ప్రభాస్ ఫ్రెండ్స్ మల్టీప్లెక్స్ అయిన వి ఎపిక్ రూరల్ ఏరియాలో ఉన్నందున టిక్కెట్ల రేట్లు బాగా తక్కువ. టిక్కెట్ల రేటు 30 రూపాయలు. ఈ రేటుతో ఈ మల్టీప్లెక్స్ ను రన్ చేస్తూ.. కరెంట్ ఛార్జీలు కూడా రావు. అందుకనే ఈ థియేటర్లను మూసేయాలి అనుకున్నారు. అయితే.. వాళ్లు క్లోజ్ చేయడం కంటే ముందే బ్యాంకర్స్ సీజ్ చేసారని సమాచారం.
ప్రస్తుతానికి కొత్త సినిమాల విడుదలలు ఏమీ లేవు. ఈ నెలాఖరున శ్రీవిష్ణు అర్జున ఫల్గుణ మాత్రమే వుంది. ఆతర్వాత జనవరి 7 నుంచి ఆర్ఆర్ఆర్, జనవరి 14 నుంచి రాధేశ్యామ్, బంగార్రాజు సినిమాలు రావాల్సి వుంది. మరి.. అప్పటికి పరిస్థితులు ఎలా వుంటాయో..? ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో..? చూడాలి. మొత్తానికి ప్రభాస్ అండ్ ఫ్రెండ్స్ కి ఇది బిగ్ షాక్ అని చెప్పచ్చు.