బరిలోకి దిగుతోన్న బాలయ్య

నటరత్న నందమూరి బాలకృష్ణ.. తనదైన కథ పడితే అది అఖండ విజయం సాధించడాన్ని ఎవరూ ఆపలేరు అంటూ మరోసారి నిరూపించుకున్నాడు. వరుస ఫ్లాప్ ల తర్వాత రీసెంట్ గా వచ్చిన అఖండ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసిందనే చెప్పాలి. బోయపాటి డైరెక్షన్ లో హ్యాట్రిక్ మూవీగా వచ్చిన ఈ చిత్రం ఊహించినదానికంటే ఎక్కువ విజయం సాధించింది. అంతే కాక బాలయ్య కెరీర్ లోనే హయ్యొస్ట్ కలెక్ట్ చేసిన చిత్రంగా నిలిచింది. దాదాపు 150కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ లోనే జోష్ తెచ్చింది. మరోవైపు ఫస్ట్ టైమ్ ను తను హోస్ట్ చేసిన అన్ స్టాపబుల్ తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాడు. ఈ షో ఇండియాలోనే టాప్ త్రీ బెస్ట్ షోస్ లో ప్లేస్ సంపాదించుకుంది. అదీ కాక అన్ స్టాపబుల్ తో తన ‘అసలు’క్యారెక్టర్ ను చూపించి ఔరా అనిపించి.. బాలయ్య నిజంగా చిన్న పిల్లాడే అనిపించుకున్నాడు. ఓ రకంగా అటు అఖండ, ఇటు అన్ స్టాపబుల్ తో ఫ్యాన్స్ లో కొత్త జోష్ నింపాడు. మరి అలాంటి సినిమా తర్వాత బాలయ్య ఎలాంటి చిత్రంతో వస్తాడా అనుకున్నారు అంతా. అందరికీ నచ్చేలాంటి నిర్ణయంతోనే తన కొత్త సినిమా ప్రకటించాడు బాలయ్య.
తన లాగానే వరుస ఫ్లాపుల తర్వాత మాస్ రాజా రవితేజతో చేసిన క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో బాలయ్య కొత్త సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే లాంఛనంగా ఓపెనింగ్ జరుపుకుందీ చిత్రం. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. కన్నడలో స్టార్ హీరోగా వెలుగుతోన్న దునియా విజయ్ ని ఈ చిత్రంలో విలన్ గా తీసుకున్నారు. ఇక మైత్రీ మూవీస్ బ్యానర్ లో రూపొందబోతోన్న ఈ ఎన్బీకే 107 చిత్రం ఈనెల మూడో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోతోంది. అంతా అనుకున్నట్టుగా అయితే.. ఈ మూవీని ఈ యేడాది వినాయక చవితి లేదా దసరాకు విడుదల చేస్తారు. మరి మంచి అంచనాలే ఉన్న ఈ మూవీతో బాలయ్య, గోపీచంద్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో చూడాలి.

Related Posts