వరదలతో ఇబ్బందులు పడిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హీరో అల్లు అర్జున్ 25 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు ఈ మొత్తాన్ని ఆయన ఇస్తున్నట్లు తెలిపారు. ట్విట్టర్ ద్వారా స్పందించిన అల్లు అర్జున్..ఏపీ వరద బాధిత ప్రజలకు తన సానుభూతిని వెల్లడించారు.
ఇప్పటికే తెలుగు హీరోలు చాలా మంది ఏపీ వరద బాధితులకు విరాళాలు ప్రకటిస్తున్నారు. చిరంజీవి, రామ్ చరణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి హీరోలంతా 25 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.