బాలీవుడ్ భామ, శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కోవడం.. గత కొన్ని రోజులుగా వార్తల్లో
ఉండడం తెలిసిందే. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసు విచారణ ఎదుర్కొంటూ జైలులో ఉన్న నిందుతుడు సుఖేష్ చంద్రశేఖర్ తో ఈ బ్యూటీకి సంబంధం ఉందని బాలీవుడ్ లో గట్టిగా టాక్ వినిపించింది. అయితే.. అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదని ప్రచారంలోకి వచ్చిన వార్తలను ఆమె ఖండించింది. అయితే.. అతనితో దిగిన ఫోటోలు బయటకు రావడంతో ఈ బ్యూటీ చుట్టు ఉచ్చు బిగిసింది.
ఇదిలా ఉంటే.. ఈ బ్యూటీ గురించి మరో వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే.. సుఖేష్ నుంచి జాక్వెలిన్ కోట్ల విలువైన బహుమతులు పొందిందని ఈడీ విచారణలో తేలిందిట. అందులో 52 లక్షల గుర్రం, 9 లక్షల పిల్ల ఉండడం విశేషం. అంతే కాకుండా 10 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నట్టు కూడా బయటపడింది. సుఖేష్ భార్య లీనా పౌల్ తో కూడా జాక్వెలిన్ కి సంబంధాలు ఉన్నాయట. ఈ అమ్మడుకే కాకుండా మరో కథానాయిక నోరా ఫతేహీనికి కూడా సుఖేష్ భారీ బహుమతులు ఇచ్చాడట. ఆమెకు ఒక బీఎండబ్ల్యూ కారు, ఐఫోన్తో పాటు మొత్తంగా రూ.కోటి విలువైన గిఫ్టులు ఇచ్చాడని సమాచారం. ఈ విలువైన గిఫ్టులు బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాయి.