బాలీవుడ్ భామ బండారం బ‌య‌ట‌పెట్టిన 52 ల‌క్ష‌ల గుర్రం, 9 ల‌క్ష‌ల పిల్లి

బాలీవుడ్‌ భామ, శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్ మ‌నీ లాండ‌రింగ్ కేసులో ఇరుక్కోవ‌డం.. గ‌త కొన్ని రోజులుగా వార్త‌ల్లో
ఉండ‌డం తెలిసిందే. 200 కోట్ల మ‌నీ లాండ‌రింగ్ కేసు విచార‌ణ ఎదుర్కొంటూ జైలులో ఉన్న నిందుతుడు సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్ తో ఈ బ్యూటీకి సంబంధం ఉంద‌ని బాలీవుడ్ లో గ‌ట్టిగా టాక్ వినిపించింది. అయితే.. అత‌నితో నాకు ఎలాంటి సంబంధం లేద‌ని ప్రచారంలోకి వ‌చ్చిన‌ వార్త‌ల‌ను ఆమె ఖండించింది. అయితే.. అత‌నితో దిగిన ఫోటోలు బ‌య‌ట‌కు రావ‌డంతో ఈ బ్యూటీ చుట్టు ఉచ్చు బిగిసింది.

ఇదిలా ఉంటే.. ఈ బ్యూటీ గురించి మ‌రో వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే.. సుఖేష్ నుంచి జాక్వెలిన్ కోట్ల విలువైన బ‌హుమ‌తులు పొందింద‌ని ఈడీ విచార‌ణ‌లో తేలిందిట‌. అందులో 52 ల‌క్ష‌ల గుర్రం, 9 ల‌క్ష‌ల పిల్ల ఉండ‌డం విశేషం. అంతే కాకుండా 10 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్న‌ట్టు కూడా బ‌య‌ట‌ప‌డింది. సుఖేష్ భార్య లీనా పౌల్ తో కూడా జాక్వెలిన్ కి సంబంధాలు ఉన్నాయ‌ట‌. ఈ అమ్మ‌డుకే కాకుండా మ‌రో క‌థానాయిక నోరా ఫతేహీనికి కూడా సుఖేష్‌ భారీ బహుమతులు ఇచ్చాడట. ఆమెకు ఒక బీఎండబ్ల్యూ కారు, ఐఫోన్‌‌తో పాటు మొత్తంగా రూ.కోటి విలువైన గిఫ్టులు ఇచ్చాడని సమాచారం. ఈ విలువైన గిఫ్టులు బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాయి.

Related Posts