మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న మిస్ శెట్టి

సమ్మర్ అంటే చాలు.. సినిమాలకు పండగే.సినిమాలు చూసేవారికీ పండగే. కానీ ఈ 2023 సమ్మర్ లో ఏ పండగా లేదు. ఒక్క సినిమా కూడా ఆకట్టుకోలేదు. ఆడియన్స్ అంతా చిన్న సినిమాలతో సరిపెట్టుకున్నారు. పోనీ అవైనా ఎంటర్టైన్ చేశాయా అంటే లేదు. దీంతో చాలాకాలం తర్వాత ఒక సమ్మర్ టాలీవుడ్ ను ఉస్సూరుమనిపించింది. అయితే ఈ సమ్మర్ లో వచ్చి ఉంటే మంచి అవకాశం కొట్టేద్దురు అనిపించుకుంటున్నారు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.

అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా అయిపోయింది. ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా వస్తుందని చెప్పిన ఈ చిత్రాన్ని సమ్మర్ లో విడుదల చేసి ఉంటే ఖచ్చితంగా ఆకట్టుకునేదే అనే టాక్ వినిపిస్తోంది. కానీ వీళ్లు భయపడ్డారా లేక ఇంకేదైనా రీజన్ ఉందా అనేది చెప్పలేం కానీ.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మాత్రం సమ్మర్ వంటి మంచి ఛాన్స్ ను మిస్ చేసుకుంది.


భాగమతి తర్వాత అనుష్క యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నటించిన చిత్రం ఇది. అంత పెద్ద బ్యానర్ కూడా ఈ విషయంలో వెనకడుగు వేసిందంటే ఓవరాల్ గా ఈ కంటెంట్ పైనే డౌట్ కొడుతుందంటే ఆశ్చర్యమేం ఉంటుంది. నిజానికి యూవీ వాళ్లు తలచుకుంటే థియేటర్స్ తో సమస్య లేదు. డిస్ట్రిబ్యూటర్స్ తో పనిలేదు. అయినా ఓ మంచి ఛాన్స్ ను ఎందుకు మిస్ చేసుకున్నారు అనే ప్రశ్న అందర్లోనూ వినిపిస్తోంది. నిజానికి ఈ మూవీ టీజర్ తో పాటు ఆ మధ్య వచ్చిన పాట కూడా ఆకట్టుకుంటుంది.

చూస్తుంటే మంచి మెటీరియల్ తోనే రూపొందినట్టు అర్థం అవుతోంది. పైగా నవీన్ పోలిశెట్టి కూడా జాతిరత్నాలుతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక అనుష్క గురించి చెప్పేదేముందీ.. అలాంటి జోడీతో రూపొందిన ఈ చిత్రం సమ్మర్ లో వచ్చి ఉంటే ఖచ్చితంగా ఆకట్టుకునేదే అనేది అందరి నోటా వినిపిస్తోన్న మాట. ఏదేమైనా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మంచి ఛాన్స్ ను మిస్ చేసుకున్నారనే చెప్పాలి.

Related Posts