ఎంటర్టైన్మెంట్ అంటే ఒకప్పుడు కేవలం నాటకాలు, వీధి బాగోతాలు మాత్రమే. తర్వాత రేడియోలు వచ్చాయి. టివిలు వచ్చాయి. అటుపై సినిమా వచ్చింది. సినిమాను మించిన ఎంటర్టైన్మెంట్ ఇప్పటి వరకూ ప్రపంచం కనిపెట్టలేకపోయింది. అయితే సినిమా రకరకాల మార్పులకు గురవుతుంది. సినిమా అనే ఫార్ములాను దాటకుండానే కొత్త ఫార్మాట్స్ మొదలయ్యాయి. అవే ఓటిటిలు. ఈ ఓటిటిలు ఇప్పుడు వెండితెరను డామినేట్ చేశాయా అన్నంతగా విజృంభిస్తున్నాయి. అందుకే మన స్టార్స్ కూడా ఈ వైపు లుక్కేస్తున్నారు. లేటెస్ట్ గా నాగార్జున కూడా నేను సైతం ఓటిటికి సిద్ధం అనేస్తున్నాడు. థియేటర్స్ లో చూసిన సినిమాలు తర్వాత ఓటిటిలో చూడ్డం నిన్నటి మాట. ఇప్పుడు అయితే థియేటర్ లేదంటే ఓటిటి అనే మాట సాధారణం అయిపోయింది. స్టార్ హీరోలు, నిర్మాతలు కూడా నేరుగా తమ చిత్రాలను ఓటిటిల్లో విడుదల చేస్తున్నారు. ఆకట్టుకుంటున్నారు. అలాంటి డైరెక్ట్ గా ఆ ప్లాట్ ఫామ్ కే సినిమాలు లేదా సిరీస్ లు చేస్తే తప్పేంటీ అనే భావన స్టార్స్ అందరిలోనూ కనిపిస్తోంది. ఈ ఫీలింగ్ ను తెలుగులో మొదలుపెట్టింది రానా అండ్ వెంకీ. ఈ ఇద్దరూ కలిసి ఓ వెబ్ సిరీస్ లో నటించబోతున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆ సిరీస్ కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇక ఇటు నాగచైతన్య ఎప్పుడో తను ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాని చెప్పాడు. మనం ఫేమ్ విక్రమ్ కుమార్ ఈ సిరీస్ ను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఆల్రెడీ ఈ ఇద్దరి కాంబోలో ఇప్పుడు థ్యాంక్యూ అనే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ మూవీ రిలీజ్ కు రెడీ అయిన తర్వాత వెబ్ సిరీస్ కు సంబంధించిన వర్క్స్ స్టార్ట్ అవుతాయి. అయితే అటు వెంకీ రానా, ఇటు తన కొడుకూ చేస్తుండగా తనకేంటీ అనుకున్నాడేమో.. నాగార్జున కూడా ఓ వెబ్ సిరీస్ కు ఓకే చెప్పాడట. రీసెంట్ గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వాళ్లు నాగ్ ను సంప్రదించారుట. నాగ్ కూడా వెంటనే ఓకే చెప్పాడని టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుంది. మొత్తంగా వియ్యంకుల ఫ్యామిలీ వెబ్ సిరీస్ లతోనూ మోత మోగించబోతున్నారన్నమాట.
|