అల్లు అరవింద్, దిల్ రాజు గీస్తున్న కొత్త స్కెచ్ ఇదేనా ?

అల్లు అర‌వింద్, దిల్ రాజు.. టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూస‌ర్స్. ఎన్నో స‌క్స‌స్ ఫుల్ మూవీస్ అందించారు. వీరిద్ద‌రూ క‌లిసి కూడా సినిమాలు నిర్మిస్తున్నారు. బాహుబ‌లి సినిమా చ‌రిత్ర సృష్టించ‌డంతో ఆ రేంజ్ లో సినిమా చేయాలని వీరిద్ద‌రూ ఫిక్స్ అయ్యారు. ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. అయితే.. వీరిద్ద‌రూ క‌లిసి ఓ సీక్రెట్ ప్లాన్ రెడీ చేశార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అది ఏంటంటే.. ఇద్దరు కలిసి ఒక మెగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ నే నిర్మించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఇందులో ఒక టాలీవుడ్ స్టార్ హీరో.మరొక బాలీవుడ్ స్టార్ హీరోని పెట్టి సినిమా చేయాలని ఫిక్స్ అయ్యార‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో ఈ సినిమా ఉంటుంద‌ట‌. ఇంకా చెప్పాలంటే.. ప్ర‌తీ గ‌డ‌ప‌కు రీచ్ అయ్యేలా ఈ సినిమాలో కంటెంట్ ఉంటుంద‌ట‌. ఇప్ప‌టికే స్టార్ రైట‌ర్స్ స్క్రిప్ట్ వ‌ర్క్ స్టార్ట్ చేసిన‌ట్లు స‌మాచారం. ఈ బ‌డా నిర్మాత‌లు ఇద్ద‌రూ ఇలా సీక్రెట్ మిష‌న్ స్టార్ట్ చేసార‌ని టాలీవుడ్ లో టాక్ గ‌ట్టిగా వినిపిస్తోంది.

దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో బయటకు రానున్నాయి. అయితే.. ఇలా ఇద్దరూ కంబైన్డ్ గా పాన్ ఇండియా చిత్రం నిర్మిస్తూనే సోలోగానూ ఎవరికి వారు పాన్ ఇండియా చిత్రాల్ని నిర్మించాలని ప్లాన్ చేసుకున్న్నట్లు సమాచారం. మ‌రి.. ఈ క్రేజీ, భారీ పాన్ ఇండియా మూవీకి డైరెక్ట‌ర్ ఎవ‌రో..? ఇందులో న‌టించే టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోలు ఎవ‌రో క్లారిటీ రావాలంటే.. కొన్నాళ్లు ఆగాల్సిందే.

Related Posts