సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ల కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ యాక్షన్ మూవీ లైగర్. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది. ఈ పాన్ ఇండియా మూవీని పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ల పై ఛార్మి, పూరి జగన్నాథ్, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీంతో ఈ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. లైగర్ చిత్రబృందం న్యూఇయర్ స్పెషల్ గిఫ్ట్ గా ఓ గ్లింప్స్ విడుదల చేశారు. ఇందులో విజయ్ దేవరకొండను సరికొత్త అవతారంలో చూపిస్తూ రౌడీ అభిమానులకు సరికొత్త ట్రీట్ ఇచ్చాడు పూరి. ఈ టీజర్ ఇలా రిలీజ్ చేశారో లేదో… అలా యూట్యూబ్ ని షేక్ చేస్తూ దూసుకెళుతుంది. ఇప్పటి వరకు 16 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ నేపథ్యంలో 24 గంటల్లో యూట్యూబ్లో ఎక్కువ వ్యూస్ దక్కించుకున్న టీజర్గా ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది.
ట్రెండింగ్ లో నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచింది. ఈ సినిమా ద్వారా ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ను టాలీవుడ్ కి పరిచయం చేస్తున్నారు పూరి. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి.. బాక్సాఫీస్ దగ్గర లైగర్ ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తాడో చూడాలి.