టాలీవుడ్ రొటీన్ అని పూజాకి చెప్పింది ఎవరు..?

పూజాహెగ్డే.. నిన్నామొన్నటి వరకూ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలిగింది. బట్ వరుసగా వచ్చిన ఫ్లాపులు అమ్మడిని ఓవర్ నైట్ డౌన్ చేశాయి. మరో వైపు శ్రీ లీల లాంటి యంగ్ బ్యూటీస్ దూసుకువస్తున్నారు. ఈ టైమ్ లో తన ఉనికిని నిలబెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్.

ఆ అవకాశాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇచ్చాడు కూడా. మహేష్‌ బాబుతో చేస్తోన్న గుంటూరు కారం సినిమాలో మెయిన్ హీరోయిన్ గానే ఛాన్స్ ఇచ్చాడు. బట్ రీసెంట్ గా తను ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో త్రివిక్రమ్ – మహేష్‌ మూవీ నుంచి మాత్రమే పూజాహెగ్డే తప్పుకుంది అనుకున్నారు. కానీ కాదట. తను ఏకంగా టాలీవుడ్ నుంచే తప్పుకునే ప్రాసెస్ లో మొదట ఈ మూవీని వదులుకుందని చెబుతున్నారు. అందుకు కారణం బాలీవుడ్ బిగ్గీ కరణ్ జోహార్ అంటున్నారు.

కరణ్ కరం పడినే హీరోయిన్ అయినా.. హీరో అయినా బాలీవుడ్ లో వెలుగుతారు. ప్రస్తుతం అతని హ్యాండ్ పూజా పై పడిందట. అతనే “టాలీవుడ్ లాంటి రొటీన్ మూవీస్ ఎందుకు చేయడం.. బాలీవుడ్ అయితే బెటర్ కదా. ఇంక వదిలేయ్” అని చెప్పాట్ట. అంటే తెలుగులో కేవలం రొటీన్ పాటలు, వాటికి డ్యాన్సులు తప్ప నువ్వు చేసేదేం ఉంది. వదిలేసి బాలీవుడ్ కు వచ్చేయ్ అని చెప్పాడట. అందుకే తట్టా బుట్టా సర్దేసుకుందట ఈ బుట్టబొమ్మ.


నిజానికి పూజాహెగ్డే మొదటి నుంచి బాలీవుడ్ టార్గెట్ గానే వెళుతోంది. అక్కడ ఆఫర్స్ రాకనే తెలుగులోకి వచ్చింది. ఈ ఫేమ్ తో మళ్లీ మళ్లీ బాలీవుడ్ లో ప్రయత్నాలూ చేస్తూనే ఉంది. బట్ తను అక్కడ చేసిన సినిమాలన్నీ డిజాస్టర్స్ గా మిగిలాయి. ఒకటీ రెండూ ఓకే అనిపించుకున్నా.. అందులో ఆమెకు వచ్చిన ప్రత్యేకమైన గుర్తింపు ఏం లేదు.

ఇంకా చెబితే ఇప్పటి వరకూ పూజాహెగ్డే చేసిన సినిమాల్లో ఫస్ట్ టైమ్ చేసిన మొహంజోదారో తప్ప మిగతా అన్నిట్లోనూ మూడో హీరోయిన్ లేదంటే నాలుగో హీరోయిన్గానే ఎక్కువగా కనిపించింది. అలాంటి అమ్మడికి లైఫ్ ఇస్తానని కరణ్‌ చెప్పడంతోనే కామ్ గా వెళ్లిపోయిందంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తను సైన్ చేసే నెక్ట్స్ ప్రాజెక్ట్ తో తెలుస్తుంది.

Related Posts