వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ‘ పోస్ట్ పోన్

దీపావళి కానుకగా విడుదలవ్వాల్సిన వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ‘ సినిమా పోస్ట్ పోన్ అయ్యింది. నవంబర్ 10న విడుదలకావాల్సిన ఈ చిత్రం నవంబర్ 24 కి వాయిదా వేసినట్టు నిర్మాత నాగవంశీ తెలిపారు. ‘ఆదికేశవ‘ చిత్రం వాయిదా పడడానికి ముఖ్య కారణం వరల్డ్ కప్ మ్యాచ్ లు జరుగుతుండడమే అని నాగవంశీ అన్నారు.

మరోవైపు నవంబర్ 10న తమిళం, హిందీ నుంచి కూడా పెద్ద సినిమాల కాంపిటేషన్ ఉంది. ఆ కారణాల రీత్యా ఈ సినిమాని వాయిదా వేసినట్టు తెలిపారు సితార ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత.

ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ కి జోడీగా శ్రీలీల నటించింది. కీలక పాత్రల్లో మలయాళం నటుడు జోజు జార్జ్ కనిపించబోతున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకుడు.

జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతాన్నందించిన ‘ఆదికేశవ‘ నుంచి ఇప్పటికే విడుదలైన మూడు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Related Posts