టైగర్ నాగేశ్వరరావు పై తప్పు వార్తలు

టైగర్ నాగేశ్వరరావు పై అవన్నీ తప్పు వార్తలు అంటూ ఫైర్ అయిందీ మూవీ టీమ్. ఈ మేరకు ఓ అఫీషియల్ నోట్ కూడా విడుదల చేశారు. ఇంతకీ టైగర్ పై వచ్చిన తప్పుడు వార్తలేంటీ అంటే.. ఈ సినిమా అక్టోబర్ 20న విడుదల కావడం లేదు అంటూ కొన్నాళ్లుగా కొన్ని వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఇవి మూవీ టీమ్ వరకూ చేరాయి.

దీంతో ఈ రూమర్ పై స్పందించారు టైగర్ నాగేశ్వరరావు మూవీ టీమ్. వారి నోట్ లో ఏముందంటే.. ” టైగర్ నాగేశ్వరరావుపై కొన్ని రోజులుగా అక్టోబర్ 20న విడుదల కావడం లేదు అంటూ ఆధారం లేని వార్తలు వస్తున్నాయి. కొంతమంది కావాలనే ఈ రూమర్స్ ను వ్యాపింపచేస్తున్నారు. మా సినిమాకు ఇప్పటికే గొప్ప పేరు వచ్చింది. థియేట్రికల్ రిలీజ్ విషయంలో చాలా పోటీ కూడా ఉంది. మీకు గొప్ప థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేందుకు మేం చాలా కష్టపడుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రూమర్స్ ను నమ్మొద్దు. టైగర్ నాగేశ్వరరావు వేట అక్టోబర్ 20 నుంచే మొదలవుతుంది..” ఇదీ టైగర్ నాగేశ్వరరావు టీమ్ నుంచి వచ్చిన స్టేట్మెంట్.


మరి ఈ సినిమాపై నెగెటివ్ రూమర్స్ ఎవరు క్రియేట్ చేశారో కానీ త్వరగానే మేల్కొన్నారు అని చెప్పాలి. సినిమా రిలీజ్ కు ఇంకా చాలా టైమ్ ఉంది. అయినా ఇప్పటి నుంచే రూమర్స్ వస్తున్నాయంటే ప్రత్యర్థులు ఈ మూవీకి భయపడుతున్నారనే అనుకోవలా లేక వీళ్లే ఇలా అటెన్షన్ గ్రాబ్ చేస్తున్నారా అనేది చెప్పలేం. బట్ త్వరగానే రియాక్ట్ అయ్యారు.


ఇక వంశీ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నాడు. గాయత్రి భరద్వాజ్, నుపుర్ శర్మ, రేణూ దేశాయ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. 1970ల కాలంలో స్టూవర్ట్ పురం ప్రాంతానికి చెందిన కరడుగట్టిన దొంగ అయిన నాగేశ్వరరావు కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.
ఇక తమ సినిమా వాయిదా పడుతుందన్న రూమర్స్ పై స్పందించారు కాబట్టి ఇక ఆ రూమర్స్ ఆగిపోతాయా లేక ఇంకా కంటిన్యూ అవుతాయా అనేది చూడాలి.

Related Posts