దొరసాని ఫేమ్ కేవిఆర్ మహేంద్ర డైరెక్షన్లో పిఆర్ ఫిలింస్ పతాకంపై పాయల్ సరాఫ్ నిర్మించిన చిత్రం ‘భరతనాట్యం’. సూర్య తేజ ఏలె ఈ చిత్రంతో పరిచయం అవుతున్నాడు. హర్షవర్ధన్,వైవా హర్ష కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం టీజర్ , ట్రైలర్ లు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసాయి. ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసంది చిత్ర యూనిట్.
సమ్మర్ కానుకగా ఏప్రిల 5 భరతనాట్యం రిలీజ్ కాబోతున్న ప్రకటించారు మేకర్స్.
తెరంగేట్రం చేస్తూనే డిఫరెంట్ సబ్జెక్ట్ ఎంచుకున్నాడు సూర్యతేజ. సూర్యకు జోడిగా మీనాక్షి గోస్వామి కనిపించింది. సినిమా హీరోగా వైవా హర్ష ట్రాక్ మెయిన్ హైలైట్లలో ఒకటి. హర్షవర్ధన్ నెగిటివ్ రోల్ పోషించగా, అజయ్ ఘోష్ పోలీసుగా కనిపించాడు.
డెబ్యూ ఇస్తున్న సూర్య తేజను, మూవీ టెక్నికల్ వేల్యూస్, స్టోరీ , డైరెక్షన్ ఇలా అన్ని విభాగాల్లోనూ ది బెస్ట్ వర్క్ చేసారని వచ్చిన అతిధులు చిత్ర యూనిట్ ని మెచ్చుకుని సినిమా ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు.