రాజధాని వివాదంలో యాంకర్ ప్రదీప్

యాంకర్ గా తెలుగు బుల్లితెరపై చిన్నపాటి మెగాస్టార్ లా వెలుగుతున్నాడు ప్రదీప్. అద్బుతమైన టైమింగ్ అతని సొంతం. డబుల్ మీనింగ్స్ లేకుండా.. కంటెస్టెంట్స్ ను డీ గ్రేడ్ చేయకుండా చాలా హుందాగా షోస్ ను నడిపిస్తుంటాడు. అందుకే మోస్ట్ లవబుల్ యాంకర్ గా అతనికి పేరుంది.

ఎంత పేరున్న యాంకర్ అయినా.. ఎంత టైమింగ్ ఉన్నా.. ఎంత స్ట్రాంగ్ మైండ్ సెట్ తో యాంకరింగ్ చేసినా అప్పుడప్పుడూ అనుకోకుండా పొరబాట్లు దొర్లుతుంటాయి. చిన్నవే అయితే ఎవరూ పట్టించుకోరు. ఇంకా చెబితే ఆ షోస్ కు సంబంధించిన వారి గురించి అయినా.. తర్వాత సారీ చెప్పడమో లేక ఇంకేదైనా రూపంలోనే సాల్వ్ చేసుకోవచ్చు.

బట్ కొన్నిసార్లు కొన్ని మాటలు తెలియకుండానే పొలిటికల్ టర్న్స్ తీసుకుంటాయి. అలా ఓ షోలో యాంకర్ ప్రదీప్ ఏపి రాజధాని వైజాగ్ అన్నాడు. అంతే.. అసలే రాజధాని విషయంలో రచ్చ రచ్చగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో అదో హాట్ టాపిక్ అయింది. ప్రదీప్ వైజాగ్ ను ఏపి రాజధాని అన్నందుకు నిరసనగా ఏపి పరిరక్షణ సమిత కన్వీనర్ శ్రీనివాసరావు ఏకంగా అతని ఇంటి ముందు ఆందోళన మొదలుపెట్టాడు.

దీంతో ప్రదీప్ తను ఉద్దేశ్యపూర్వంగా అలా మాట్లాడలేదని.. ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసేందుకే చెప్పానని.. దీని ద్వారా ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమాపణలు కోరుతున్నాను అన్నాడు. దీంతో ఆ గొడవ అలా సద్దుమణిగింది. అయినా ఇదే మాటలు చెప్పిన జగన్ ఇంటి ముందు కూడా ఇలాగే ధర్నా చేస్తారా వీళ్లు అని ప్రదీప్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

Related Posts