అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కుమార్తె జాహ్నవిని టాలీవుడ్ కి పరిచయం చేయాలని.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్, టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు కానీ.. ఇప్పటి వరకు కుదరలేదు. జాహ్నవికి శ్రీదేవి కుమార్తెగానే కాదు, సోషల్ మీడియా పోస్టులతో కూడా బాలీవుడ్ హీరోయిన్ జాహ్నవికి చాలా పాపులారిటీనే వుంది. అయితే… ఆమధ్య ఎన్టీఆర్ సరసన జాహ్నవి నటిస్తుందని.. టాలీవుడ్ ఎంట్రీ కన్ ఫర్మ్ అయ్యిందని వార్తలు వినిపించాయి. ఆరత్వాత ఆ వార్తల్లో వాస్తవం లేదని తెలిసింది.
ఇప్పుడు జాహ్నవి టాలీవుడ్ ఎంట్రీకి అంతా ఫిక్స్ అయ్యిందని.. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. జాహ్నవిని టాలీవుడ్ కు పరిచయం చేయనున్నారని తెలిసింది. ఇంతకీ విషయం ఏంటంటే… పూరి జగన్నాథ్ ప్రస్తుతం లైగర్ మూవీ చేస్తున్నారు. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఆగష్టు 25న లైగర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది.
అయితే… ఈ సినిమా రిలీజ్ కాకుండానే విజయ్ దేవరకొండతో పూరి జగన్నాథ్ మరో సినిమా చేయాలి అనుకుంటున్నాడట. ఈ సినిమాలో హీరోయిన్ గా జాహ్నవిని తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు మాటలు జరిగాయని, అంతా ఓకె అయిందని సమాచారం. ఈ సినిమా ఎలాగూ తెలుగు, హిందీ భాషల్లో తయారవుతుంది. కనుక ఆ విధంగా జాహ్నవి తెలుగు తెరకు పరిచయం అవుతుంది. మొత్తానికి ఎప్పటి నుంచో అనుకుంటున్న జాహ్నవి టాలీవుడ్ ఎంట్రీ ఇన్నాళ్లకు సెట్ అయ్యింది. అది కూడా పూరి డైరెక్షన్లో. మరి… అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాహ్నవి తెలుగు ప్రేక్షకులను ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి.