“అఖండ” గురించి మాట్లాడ‌నంటున్న‌ బోయ‌పాటి

నందమూరి న‌ట‌సింహం బాలకృష్ణ న‌టించిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ అఖండ‌. ఈ చిత్రానికి మాస్ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్లో రూపొందిన‌ సింహ‌, లెజెండ్ చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్స్ అవ్వ‌డం తెలిసిందే. దీంతో తాజాగా వీరిద్ద‌రి కాంబినేష‌న్లో రూపొందిన అఖండ సినిమా పై అటు అభిమానుల్లోను ఇటు ఇండ‌స్ట్రీలోను భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ద్వార‌కా క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబ‌ర్ 2న అఖండ ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి కానీ.. ఈ సినిమాను గురించి బోయపాటి ఇప్పటి వరకు తనదైన స్టైల్లో మాట్లాడకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అఖండ గురించి ఇంట‌ర్ వ్యూలు అడిగితే… నేను ఏదైనా సినిమా రిలీజ్ తర్వాతే మాట్లాడతానని, ఇప్పుడేమి మాట్లాడడని బోయ‌పాటి చెబుతుండడం విశేషం. దీనికి కారణం ఏంటంటే.. అఖండ సినిమాకి ముందు బోయ‌పాటి తెర‌కెక్కించ‌ని సినిమా విన‌య విధేయ రామ‌. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన విన‌య విధేయ రామ‌ సినిమా విషయంలో చాలా న‌మ్మ‌కంగా ఇంట‌ర్ వ్యూ ఇచ్చారు బోయ‌పాటి.

ఆ సినిమా విష‌యంలో బోయ‌పాటి చెప్పింది ఒక‌టి.. ఆత‌ర్వాత‌ జరిగింది ఒకటి. దీంతో బోయ‌పాటి పై విపరీతమైన ట్రోలింగ్ జ‌రిగింది. అందుకే.. ఈసారి బోయపాటి అఖండ సినిమా విడుద‌ల‌కు ముందు మాట్లాడ‌కూడ‌దు అని నిర్ణ‌యించుకున్నార‌ట‌. అఖండ విడుద‌లైన త‌ర్వాత రిజెల్ట్ ని బ‌ట్టి మాట్లాడాలి అనుకుంటున్నార‌ట‌. పైగా స‌క్స‌స్ త‌ర్వాత మాట్లాడితే ఆ జోష్ వేరుగా ఉంటుంది. అందుక‌నే బోయ‌పాటి ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. మ‌రి.. అఖండ విడుద‌ల త‌ర్వాత బోయ‌పాటి ఏం మాట్లాడ‌తారో చూడాలి.

Related Posts