శ్రీదేవి కూతురు, ఎన్టీఆర్ మనవడు .. ఇది ఫిక్స్

బాలీవుడ్ బ్యూటీస్ సౌత్ లో హల్చల్ చేయడం కామనే. బట్ ఒకప్పుడు సౌత్ హీరోయిన్లే బాలీవుడ్ ను రూల్ చేశారు. ఆ రూలింగ్ లో అందరికీ ఎక్కువ కనెక్ట్ అయిన బ్యూటీ శ్రీదేవి. ఆ దేవి కూతురు జాన్వీ కపూర్ కూడా హీరోయిన్ అయిపోయింది. అప్పటి నుంచి తనను తెలుగులోనో, తమిళ్ లోనో నటింప చేయాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఫైనల్ గా తను తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతోందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మరి ఎవరి సరసనా అంటారా.. జస్ట్ వెయిట్.

జాన్వీ కపూర్.. బాలీవుడ్ డ్రీమ్ గాళ్స్ లో ఒకరుగా మారింది. సినిమాల కంటే సోషల్ మీడియాలో హాట్ హట్ ఫోటో షూట్స్ తో హల్చల్ చేస్తూ ఉంటుంది. మరోవైపు శ్రీదేవి మరణం తర్వాత తను కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతోందీ అనేవారూ ఉన్నారు. అందుకు కారణం.. తను ఎక్కువగా హీరోయిన్ ఓరియంటెడ్ స్టోరీస్ కు ప్రాధాన్యత ఇస్తుండటమే. లేటెస్ట్ గా గుడ్ లక్ జెర్రీ అనే సినిమాతో వచ్చింది. ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదలైన ఈ చిత్రానికి మంచి ప్రశంసలు వస్తున్నాయి. ఈ టైమ్ లో జాన్వీ తన తెలుగు డెబ్యూ గురించి ఓ కీలకమైన అప్డేట్ ఇచ్చింది.

ఎన్టీఆర్ సరసన జాన్వీని నటింపచేయాలని చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు. కానీ మధ్యలో అలియాభట్ పేరు వినిపించింది. ముఖ్యంగా కొరటాల శివ డైరెక్షన్ లో రూపొందే సినిమా కోసం అలియా కన్ఫార్మ్ అయినట్టే అని చెప్పారు కూడా. తను పెళ్లి చేసుకోవడంతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో కొన్నాళ్లుగా జాన్వీ కోసం ప్రయత్నిస్తోంది టీమ్. ఈ ప్రయత్నం ఫలించినట్టే కనిపిస్తోందనే వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం.. జాన్వీ ”జూనియర్ ఎన్టీఆర్ సార్ తో కలిసి పనిచేయడం నాకు మీనింగ్ ఫుల్ ఎక్స్ పీరియన్స్”అన్నట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అయితే తను ఎన్టీఆర్ తో నటిస్తున్నాను అని ఖచ్చితంగా చెప్పకపోవడంతో చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉంది. అయినా సరే.. తనే చెప్పింది కాబట్టి.. ఎన్టీఆర్, కొరటాల ప్రాజెక్ట్ లో యంగ్ టైగర్ తో చిందులేసే బ్యూటీ జాన్వీయే నని తేలిపోయినట్టే అంటున్నారు.

Related Posts