ఆచార్య రూట్ లోనే సర్కారువారి పాట..?

అనుకున్నది ఒక్కటీ.. అయినది ఒక్కటీ అనే పాట సినిమా పరిశ్రమకు చాలాసార్లు వర్తిస్తుంది. భారీ అంచనాలున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అంటాయి. అసలే మాత్రం ఎక్స్ పెక్టేషన్స్ లేని మూవీస్ సూపర్ హిట్ అనిపించుకుంటాయి. ఈ రెండిటి మధ్య అంచనాలు పెంచే క్రమంలో జరిగే ప్రయత్నాలన్నీ బెడిసికొట్టే సందర్భాలూ వస్తాయి. అలాంటి సందర్భం రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ఆచార్యకు వచ్చింది. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారువారి పాటకూ కనిపిస్తోంది. యస్.. ఈ మూవీ టీమ్ ప్రమోషన్స్ పేరుతో రకరకాల ఇంటర్వ్యూస్ ఇస్తున్నా.. అవేవీ ఆడియన్స్ అటెన్షన్ ను గ్రాబ్ చేయలేకపోతున్నాయి. అంటే సినిమాపై అస్సలు బజ్ రావడం లేదన్నమాట. ట్రైలర్ చూస్తే రెండు మూడు సినిమాలు మిక్స్ చేసినట్టు కనిపించింది. కాస్త జోష్ గానే కనిపించినా.. ట్రైలర్ మరీ సూపర్బ్ అనిపించుకోలేకపోయింది. అప్పుడే అంచనాలు తగ్గాయి. ఇక రీసెంట్ గా వచ్చిన కీర్తి సురేష్ పాట గురించి ఓ రేంజ్ లో చెప్పుకున్నా.. కీర్తి మాస్ స్టెప్పులు తప్ప పాటలో అంత సత్తా ఏం కనిపించడం లేదు. పోనీ పాట వల్ల సినిమాకు అంచనాలు తగ్గుతాయా అనుకున్నా.. ఎందుకో సర్కారువారి పాటకు క్రేజ్ రావడం లేదని తెగ ఫీలవుతోందట ఎంటైర్ మూవీటీమ్.

మహేష్ బాబు అప్పిచ్చే వ్యక్తి పాత్రలో నటించాడు అని చెప్పారు. ఈ పాయింట్ అందరికీ కనెక్ట్ అయ్యేదే. అయితే సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగేలా అందరినీ కనెక్ట్ చేసే ప్రమోషన్స్ లో అది కనిపించడం లేదు. దీంతో చివరికి ఆచార్యలా కాదు కదా అని భయపడుతోందట ఎంటైర్ టీమ్. పరశురామ్ డైరెక్షన్ లో వస్తోన్న ఈచిత్రంపై అతను మాత్రం బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అటు మహేష్ బాబు కూడా ఇంటర్వ్యూస్ లో బానే చెబుతున్నాడు. కీర్తి సురేష్ సైతం ఆహా ఓహో అనేస్తోంది. బట్.. అవేవీ ఆడియన్స్ లో జోష్ తీసుకురాలేకపోతున్నాయని ఇండస్ట్రీ కూడా ఆశ్చర్యపోతోంది.
ఏదేమైనా ప్రమోషన్స్ తో క్రేజ్ పెంచడంలో ఇప్పుడు సర్కారువారిపాట ఆచార్య రూట్ లోనే ఉందనేది నిజం. మరి సినిమా విడుదలకు మరో రెండు మూడు రోజులే ఉంది కాబట్టి.. ఈ టైమ్ లో ఇంకేదైనా మ్యాజిక్ చేస్తారా అనేది చూడాలి.