ప్రముఖ నటి అనసూయ తండ్రి సుదర్శన్ రావు కస్బా ఈరోజు మృతి చెందారు. వయసు 63 సంవత్సరాలు. ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని తార్నాకలో ఆయన ఇంట్లో మృతి చెందారు. ఆయన రాజీవ్ గాంధీ టైమ్ లో యూత్ కాంగ్రెస్ పబ్లిసిటీ సెక్రటరీగా వర్క్ చేశారు. అనసూయకు పితృవియోగం విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, అనసూయ స్నేహితులు సంతాపం తెలియచేశారు.
తెలుగులో పలు సినిమాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ ప్రస్తుతం పుష్ప సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. అలాగే కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగమార్తాండ సినిమాతో పాటు రవితేజ, రమేష్ వర్మ కాంబినేషన్లో వస్తున్న ఖిలాడి సినిమాలో కూడా అనసూయ కీలక పాత్రల్లో నటిస్తోంది. పుష్ప సినిమాలో అనసూయ సునీల్ భార్యగా నటించిందని సమాచారం.