ప‌వ‌ర్ స్టార్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ న‌టించ‌డం నిజ‌మేనా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విభిన్న క‌థా చ‌త్రాల ద‌ర్శ‌కుడు క్రిష్ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు. ఈ చిత్రాన్ని సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ ఏఎం ర‌త్నం నిర్మిస్తున్నారు. దాదాపుగా 120 కోట్ల భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతోంది. ఎప్పుడో పూర్తి కావాల్సిన సినిమా ఇది. అయితే.. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఇప్పుడు తాజా షెడ్యూల్ ను జ‌న‌వ‌రి నుంచి స్టార్ట్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇటీవ‌లే లోకేష‌న్స్ చూసి ద‌ర్శ‌కుడు క్రిష్‌, నిర్మాత ఏఎం ర‌త్నం ఫైన‌ల్ చేశారు.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. ఇందులో నిధి అగర్వాల్ ప్రధాన కథానాయికగా నటిస్తుంది. మరో హీరోయిన్‌గా జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ను ఎంపిక చేశారు. అయితే.. ఈ అమ్మ‌డు ప్రస్తుతం ఒక కేసులో ఇరుక్కుంది. అందుచేత ఈ కేసు నిమిత్తం ఈడీ ఆఫీస్ చుట్టూ తిరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఆమె వీర‌మ‌ల్లు షూటింగ్ లో పాల్గొనే అవకాశం లేదు. కావున‌ జాక్వెలిన్ స్థానంలో మరో బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీని ఎంపిక చేయబోతున్నారని వార్త‌లు వ‌స్తున్నాయి.

నిజానికి నర్గీస్ ను టాలీవుడ్ కు పరిచయం చేయాలని చాలా మంది దర్శక, నిర్మాతలు అనుకున్నారు కానీ వర్కవుట్ కాలేదు. ప్ర‌స్తుతం క్రిష్ న‌ర్గీస్ తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. దాదాపు ఈ అమ్మ‌డు ఈ మూవీలో న‌టించ‌డం ఖాయం అంటున్నారు టాలీవుడ్ జ‌నాలు. ఈ సినిమాలో న‌టించే ఛాన్స్ ద‌క్కించుకుంటే.. టాలీవుడ్ లో ఫ‌స్ట్ మూవీనే ఏకంగా పవర్ స్టార్ తో స్ర్కీన్ షేర్ చేసుకోవడం అంటే ల‌క్కీనే అని చెప్పాలి. మరి.. వీర‌మ‌ల్లు మేక‌ర్స్ ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త‌ల పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Related Posts