అల్లు అర్జున్ నెక్ట్స్ ప్రాజెక్ట్ కూడాఓకే అయిందా..?

పుష్ప తర్వాత ప్యాన్ ఇండియాలోనే కాదు.. ప్యాన్ వరల్డ్ లోనే తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు ఐకన్ స్టార్ అల్లు అర్జున్. అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు, సన్మానాలు, సత్కారాలు అందుకుంటున్నాడంటే కారణం ఈ సినిమానే అనేది అందరికీ తెలుసు. అఫ్ కోర్స్ అంతకు ముందు చేసిన అల వైకుంఠపురములో కూడా ఆ క్రేజ్ కు మరో రీజన్. తన సినిమాలకు సంబంధించి అన్నీ తానై ముందుండి నడిపిస్తుంటాడు అల్లు అర్జున్. అది అతని ప్యాషన్ ను తెలియజేస్తుంది. రీసెంట్ గా పుష్ప 2 కూడా స్టార్ట్ అయింది. వర్షాలు పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టగానే వీరు అడవుల బాట పడతారు. మంచి వెదర్ లో షూటింగ్ చేసేందుకు తరలి వెళతారు. ఈ లోగా హైదరాబాద్ లో కొన్ని కీలకమైన సీన్స్ ను షూట్ చేస్తారంటున్నారు. అయితే ప్రస్తుతం టాప్ స్టార్స్ అంతా ఒకటి కంటే ఎక్కువ సినిమాలను లైన్ లో పెట్టుకుంటున్నారు. పుష్ప మొదలైన దగ్గర నుంచీ అల్లు అర్జున్ ఆ ప్లాన్ చేయలేదు. బట్ ఈ రెండో పార్ట్ స్టార్ట్ అయిన తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి కూడా ప్లాన్ చేసుకుంటున్నాడట. ఆ ప్లాన్ లో భాగంగా సర్కారువారి పాటితో షాక్ తిన్న పరశురామ్ చెప్పిన కథ “బావుంది” అన్నాడంటున్నారు.
పరశురామ్ సర్కారువారి పాట తర్వాత నాగ చైతన్యతో సినిమా చేయాల్సి ఉంది. కానీ చైతూ వరుసగా రెండు ఫ్లాపులు చూసిన తర్వాత పరశురామ్ వైపు మొగ్గు చూపడం లేదంటున్నారు. దీంతో పరశురామ్ కూడా తన కథలకు పదును పెంచి స్టార్ హీరోలకే చెప్పాలనుకుంటున్నాడట. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ను కలిసి మెడికల్ మాఫియా చుట్టూ తిరిగే ఓ పవర్ ఫుల్ స్టోరీ చెప్పాడంటున్నారు. మెడికల్ మాఫియా అనేది యూనివర్సల్ కంటెంట్. కాబట్టి ప్యాన్ ఇండియన్ సబ్జెక్ట్ గానూ ఫిట్ అవుతుంది. అందుకే కొన్ని మార్పులు చెప్పి ఫుల్ స్క్రిప్ట్ తో రమ్మన్నాడట బన్నీ. మరి అవన్నీ అతనికి నచ్చేలా చేయగలిగితే అల్లు అర్జున్ – పరశురామ్ కాంబినేషన్లో సినిమా ఉంటుందనుకోవచ్చు.

Related Posts