గోపీచంద్ ‘భీమా‘ నుంచి రొమాంటిక్ సాంగ్

మ్యాచో స్టార్ గోపీచంద్ లేటెస్ట్ మూవీ ‘భీమా‘. కన్నడ స్టార్ డైరెక్టర్ ఎ.హర్ష ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం మహాశివరాత్రి కానుకగా మార్చి 8న విడుదలకానుంది. ఇప్పటికే టీజర్ తో అలరిస్తోన్న ‘భీమా‘ నుంచి లేటెస్ట్ గా సాంగ్ రిలీజయ్యింది. ‘ఏదో ఏదో మాయ.. అనుకుంటూనే పడిపోయా‘ అంటూ సాగే ఈ గీతాన్ని కళ్యాణ్ చక్రవర్తి రాయగా.. అనురాగ్ కులకర్ణి ఆలపించాడు.

‘కె.జి.యఫ్, సలార్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతంలో రూపొందిన ఈ పాటను హీరోహీరోయిన్లు గోపీచంద్, మాళవిక శర్మ మధ్య చిత్రీకరించారు. పోలీస్ పాత్రలో గోపీచంద్.. టీచర్ గా మాళవిక శర్మ మధ్య వచ్చే రొమాంటిక్ గీతంగా సినిమాలో ఈ పాట ఉండబోతుంది. ఇక.. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ‘భీమా‘ గోపీచంద్ కి ఎలాంటి విజయాన్నందిస్తుందో చూడాలి.

Related Posts