మహి.వి.రాఘవ్ దర్శకత్వంలో వచ్చిన ‘యాత్ర’ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ గా రాబోతున్న సినిమా ‘యాత్ర 2’. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర’ చిత్రాన్ని తీసుకొస్తే.. ఇప్పుడు ఆయన తనయుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరుని, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ‘యాత్ర 2’ని తెరకెక్కిస్తున్నారు.
‘యాత్ర’లో రాజశేఖర్ రెడ్డిగా కనిపించిన మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి సీక్వెల్ లోనూ కనిపించబోతున్నారు. వై.ఎస్.జగన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ జీవా నటిస్తున్నాడు. ఇక తాజాగా ఈ సినిమాలో సోనియా పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. సోనియా పాత్రను జర్మనీ నటి సుజానే బెర్నెర్ట్ పోషిస్తుంది. ‘యాత్ర’ చిత్రం ఫిబ్రవరి 8, 2019లో విడుదలైంది. ఇప్పుడు ‘యాత్ర 2’ ని కూడా అదే తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు, 2024 ఫిబ్రవరి 8న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది.