యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన అభిమానులకు క్షమాపణలు చెప్పారు. అందుకు కారణమేంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శుక్రవారం బ్రహాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ను భారీ ఎత్తున రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేశారు. అయితే చివరి నిమిషంలో గణేష్ నిమజ్జనాల కారణంగా భద్రత కల్పించలేమని పోలీసులు చెప్పటంతో క్యాన్సిల్ చేశారు. దాన్ని పార్క్ హయత్లో నిర్వహించారు. ఇది తారక్ అభిమానులకు నిజంగా నిరాశను కలిగించే విషయం. చాలా మంది తమ అసహనాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మారటం.. అందులో తన అభిమానులు వచ్చే అవకాశం లేకపోవటంతో ఎన్టీఆర్ వేదికపై నుంచి అభిమానులకు క్షమాపణలు చెప్పారు. అసలు వేదికను ఎందుకు మార్చారనే దానికి కారణం చెబుతూ అభిమానులు బ్రహాస్త్ర సినిమాను ఆదరించాలని కోరారు. ఇదే సందర్భంలో సినీ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘‘ఈరోజు గ్లోబల్గా సినిమా ఇండస్ట్రీ తెలియని ప్రెషర్కి లోనవుతుంది. ఎందుకంటే ప్రేక్షకులకు కొత్తగా ఏదో కావాలి. ఇంకా ఏదో కావాలి. నేను పర్సనల్గా చెప్పేవిషయమేమంటే ఒత్తిడిలో ఉన్నప్పుడు సినిమా వాళ్లు అద్భుతంగా పెర్ఫామ్ చేస్తాం. ప్రెషర్ బావుంది. టోటల్ సినీ ఇండస్ట్రీ ఈ ఛాలెంజ్ను యాక్సెప్ట్ చేయాలి. మంచి మంచి సినిమాలు చేయాలి. ఛాలెంజ్ను స్వీకరించి ముందుకు వెళదాం. మంచి.. గొప్ప సినిమాలను మన ప్రేక్షకుల కోసం రూపొందిస్తాం’’ అన్నారు. ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.