ఆర్జీవీ పొలిటికల్ డ్రామా ‘వ్యూహం‘ ట్రైలర్ 2 రిలీజ్

అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేనట్లే తన ‘వ్యూహం‘ సినిమా రిలీజ్ ను కూడా ఎవరూ అడ్డుకోలేరని మీడియా ముందుకు వచ్చాడు రామ్ గోపాల్ వర్మ. ఈ సంచలన దర్శకుడు తెరకెక్కించిన ‘వ్యూహం‘ సినిమా సెన్సార్ అడ్డంకులను తొలగించుకుని డిసెంబర్ 29న విడుదలకు ముస్తాబవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ట్రైలర్ 1 రిలీజవ్వగా.. లేటెస్ట్ గా ట్రైలర్ 2 రిలీజ్ చేశారు. వై.ఎస్ రాజ శేఖర రెడ్డి మరణం నుండి మొదలై జగన్ అరెస్ట్, ఆయన పార్టీ పెట్టి సీఎం అవడం వంటి సంఘటలు ఈ ట్రైలర్ లో కనిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను ప్రతిబింబిస్తూ తాను ఈ చిత్రాన్ని తెరకెక్కించానని తెలిపాడు రామ్ గోపాల్ వర్మ. రామదూత క్రియేషన్స్ బ్యానర్ లో దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటించగా, వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించనుంది. అయితే.. ఈ సినిమాలో రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ పాత్రలను పోలిన క్యారెక్టర్స్ ఉంటాయి. అయితే వాటికి చంద్రబాబు, పవన్ రియల్ లైఫ్ కు సంబంధం లేదంటున్నాడు వర్మ.

Related Posts