‘గుంటూరు కారం‘ నుంచి ‘ఓ మై బేబి‘ సాంగ్ ప్రోమో

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం‘ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ఫస్ట్ సింగిల్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ‘ఓ మై బేబి‘ రాబోతుంది.

అందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో అమ్మూ అంటూ అందాల శ్రీలీలను ప్రేమగా పిలుస్తూ.. రవణగాడు గుర్తెట్టుకో గుంటూరొస్తే పనికొస్తోంది అన్న మహేష్ డైలాగ్ ఆకట్టుకుంటుంది. తమన్ సంగీతంలో సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ గీతాన్ని శిల్పా రావు ఆలపించింది. ‘ఓ మై బేబి‘ ఫుల్ సాంగ్ డిసెంబర్ 13న రాబోతుంది.

Related Posts