తెలుగులోనూ బిజీ అవుతోన్న త్రిష

వయసు పెరుగుతోన్నా వన్నె తగ్గని అందంతో మిల మిలా మెరిసిపోతుంది త్రిష. రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పటికీ హీరోయిన్ గా వరుస ఆఫర్లు అందుకుంటుంది. ‘పొన్నియిన్ సెల్వన్, లియో‘ సినిమాల తర్వాత తమిళంలో అజిత్ ‘విడ మూయార్చి‘, కమల్ హాసన్ ‘234‘ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది. తమిళంలో మాత్రమే కాదు.. తెలుగులోనూ సీనియర్ హీరోస్ కి ఈ బ్యూటీయే మెయిన్ ఆప్షన్ గా మారుతోంది.

చిరంజీవి సోషియో ఫాంటసీ ‘విశ్వంభర‘లో ముగ్గురు లేదా నలుగురు హీరోయిన్స్ ఉంటారనే ప్రచారం జరుగుతోంది. వీరిలో మెయిన్ హీరోయిన్ గా అనుష్క పేరు వినిపించింది. అయితే అనుష్కకు బరువు సమస్య ఉండడంతో ఆ పాత్రకు త్రిషను ఎంపిక చేసే సన్నాహాల్లో ఉందట టీమ్. గతంలో చిరంజీవి ‘స్టాలిన్‘ మూవీలో హీరోయిన్ గా నటించింది త్రిష. అదే సినిమాలో అనుష్క స్పెషల్ సాంగ్ లో మెరిసింది.

చిరంజీవి ‘విశ్వంభర‘తో పాటు నాగార్జున 100వ సినిమాలోనూ త్రిష హీరోయిన్ గా నటించబోతుందని వినిపిస్తోంది. ప్రస్తుతం తన 99వ చిత్రంగా ‘నా సామిరంగ‘ చేస్తున్నాడు నాగార్జున. ఆ తర్వాత తన సెంచరీ మూవీని తమిళ డైరెక్టర్ నవీన్ తో చేయబోతున్నాడు. ఈ సినిమాలో త్రిష ను హీరోయిన్ గా పరిశీలిస్తున్నారట. నాగార్జునతోనూ గతంలో ‘కింగ్‘ సినిమాలో హీరోయిన్ గా నటించింది త్రిష. మొత్తంమీద.. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో త్రిష సందడి చేయబోతుందన్నమాట.