ఆరాధ్య లేకపోతే ఏదీ వద్దట.. ఖుషీ సాంగ్

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తోన్న సినిమా ఖుషీ. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ నుంచి లేటెస్ట్ గా మరో పాట విడుదల చేశారు. గతంలో రిలీజ్ చేసిన నా రోజా నువ్వే అనే పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా ఇప్పటి వరకూ 61 మిలియన్ వ్యూస్ కు పైగా సంపాదించుకుందీ పాట. దీంతో రెండో పాటపైనా మంచి అంచనాలున్నాయి. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈ పాట చూస్తే ఆ అంచనాలను అందుకునేలానే కనిపిస్తోంది. ఆరాధ్యా నా ఆరాధ్యా అంటూ సాగే ఈ గీతం హీరోయిన్, హీరోకు ఒకరిపై ఒకిరికి ఎంత ప్రేమ ఉందనేది తెలిపేలా ఉంది.


విశేషం ఏంటంటే.. ఫస్ట్ సాంగ్ ను రాసిన దర్శకుడు శివ నిర్వాణ ఈ పాటను కూడా రాశాడు. మధ్యలో సమంత అనారోగ్యం వల్ల వచ్చిన గ్యాప్ ను అతను ఇలా పాటలు రాసుకునేందుకు వాడుకున్నాడేమో అనిపిస్తోంది కదా..? మొదటి పాటలో ఇద్దరి పరిచయం, హీరో ప్రేమలో పడటం.. ఆమెను ప్రేమించేలా చేసేందుకు ప్రయత్నించడం కనిపించింది. అయితే ఈ పాటలో ఏకంగా ఇద్దరూ పెళ్లి చేసుకుని కాపురం కూడా పెట్టిన తర్వాత వచ్చేలా ఉంది. ఇద్దరూ కార్పోరేట్ జాబ్స్ లో ఉన్నట్టుగా కనిపిస్తోంది.


ఇక ఈ పాటను చాలా రోజుల తర్వాత సిధ్ శ్రీరామ్ పాడాడు. అతను పాడితే హిట్ అనే సెంటిమెంట్ రిపీట్ అయ్యేలా ఉంది. అలాగే గతంలో విజయ్ దేవరకొండకు గీత గోవిందం టైమ్ లో సిధ్ పాడిన ఇంకేం ఇంకేం కావాలే పాట ఓ రేంజ్ లో ఊపేసింది. మరి ఈ పాట కూడా ఈ సినిమాకు అలా ప్లస్ అవుతుంది అనిపిస్తోంది. ఇక సిధ్ తో పాటు చిన్మయి శ్రీ పాద కూడా ఆలపించిన ఈ గీతాన్ని షియాస్ అబ్దుల్ వాహబ్ స్వరపరిచాడు. మరి ఈ పాట ఖుషీకి ఎంత ఖుషీ తెస్తుందో చూడాలి.

Related Posts