డ్రగ్స్ కేస్ లో వరలక్ష్మికి ఎన్ఐఏ నోటీస్ లు

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా వరుస సినిమాలతో దూసుకుపోతోన్న వరలక్ష్మి శరత్ కుమార్ కు ఎన్ఐఏ(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) నోటీస్ లు జారీ చేసింది. ఈ నోటీస్ లు చూస్తే ఇది ఒక డ్రగ్స్ కేస్ కు సంబంధించినది అని చెబుతున్నారు. అయితే వరలక్ష్మీకి ఈ కేస్ తో ప్రత్యక్షంగా సంబంధాలు లేవు. ఆమెకు అత్యంత సన్నిహితుడైన ఆధిలింగం అనే వ్యక్తి కేస్ లో సూత్రధారి. అతను చాలాకాలంగా వరలక్ష్మీకి సన్నిహితుడు అని విచారణలో తేలడంతోనే ఈమెకు కూడా నోటీస్ లు పంపించారు. అతను వరలక్ష్మి నటించిన కొన్ని సినిమాలకు ఫైనాన్స్ కూడా చేశాడని టాక్.


ఆది లింగం అనే వ్యక్తిని కేరళలోని వళింజం బీచ్ లో ఏకే 47 తో పాటు 300కేజీల హెరాయిన్ తో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పోలీస్ లు. ఆ గన్ తో పాటు హెరాయిన్ ను సీజ్ చేశారు. 300 కేజీల హెరాయిన్ అంటే చాలా కోట్లు విలువ ఉంటుంది. పైగా ఏకే 47 అంటే వ్యవహారం సీరియస్ అనే భావిస్తున్నారు ఎన్ఐఏ వాళ్లు. ఇప్పటికే సినిమా పరిశ్రమల్లో డ్రగ్స్ కలకలం నడుస్తుంది.

దీనికి తోడు వరలక్ష్మి సౌత్ లోని అన్ని భాషల్లో నటిస్తోంది. దీంతో ఈ కేస్ లో తన పాత్ర ఉందా లేదా, ఈ ఆదిలింగంతో ఆమెకు ఎప్పటి నుంచి పరిచయం ఉంది.. ఎలాంటి పరిచయం వంటి అంశాలను ఇన్వెస్టిగేషన్ లో తేల్చబోతున్నారు. మొత్తంగా ఎన్ఐఏ లాంటి పెద్ద ఏజెన్సీ నోటీస్ లు అంటే అనుమానం లేకుండా జరగదు. మరి ఈ కేస్ లో వరలక్ష్మి నిర్దోషిగా ప్రూవ్ చేసుకుంటుందా లేదా అనేది చూడాలి.

Related Posts